AP Government : పెన్షన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం స్పష్టత

రాష్ట్ర ప్రభుత్వం మరో 2 లక్షల మందికి పెన్షన్లు కట్ చేయనుందని జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ‘పెన్షన్లు తీసేస్తున్నారంటూ వివిధ సోషల్ మీడియా, మీడియా, పలు వెబ్ సైట్లలో రకరకాల తప్పుడు కథనాలు వెలువడుతున్నాయి. పెన్షన్లు ఎక్కడా తగ్గించడం లేదు. పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మొద్దు’ అని స్పష్టం చేసింది. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్దితులు గమనిస్తున్న లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఏమాత్రం ఊరటనిస్తుందో చూడాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కాగా అమలు చేస్తున్న పథకం పెన్షన్లు మాత్రమేన్న ప్రచారం నేపథ్యంలో వీటిని కూడా తొలగిస్తున్నారన్న చర్చ ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విధంగా వివరణ విడుదల చేసినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com