AP Government : మత్స్యకారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

X
By - Manikanta |25 July 2024 1:00 PM IST
మత్స్యకారులకు అండగా ఉండేలా GO 217ను రద్దు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం GO నం.217 తెచ్చి మత్స్యకారుల పొట్ట కొట్టిందని మండిపడ్డారు. ఈ GOతో సొసైటీల పరిధిలోని చెరువులను వైసీపీ కార్యకర్తలకు అప్పగించి లక్షలాది మత్స్యకారులను ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. GO రద్దుతో 3325 చిన్న తరహా సాగునీటి చెరువులు, 23,920 పంచాయతీ చెరువులు, 118 రిజర్వాయర్లు సొసైటీలకే దక్కనున్నాయి. తాజాగా ప్రభుత్వం 217 జీవోను రద్దు చేయడంతో.. రాష్ట్రంలోని 3325 చిన్న తరహా సాగునీటి చెరువులు, 23,920 పంచాయతీ చెరువుల, 118 పెద్ద రిజర్వాయర్లు తిరిగి మత్స్యకార సొసైటీలకే దక్కనున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార కుటుంబాల్లో ఆనందం నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com