విశాఖలో టీడీపీ నాయకులే టార్గెట్గా ఆస్తులు ధ్వంసం..

X
By - kasi |21 Nov 2020 9:24 AM IST
విశాఖలో టీడీపీ నాయకులే టార్గెట్గా వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా.. కాపులుప్పాడ వద్ద టీడీపీ నాయకులు కాశీ విశ్వనాథ్కు చెందిన గోకార్టింగ్ను తొలగిస్తున్నారు అధికారులు. సర్వే నెంబర్ 299/1, 301ల్లో ఉన్న 4 ఎకరాలలోని నిర్మాణాలను తొలగిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి తొలగింపు పనులు చేపట్టారు. CRZ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారంటూ తొలగిస్తున్నారు. జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ రాంబాబు ఆధ్వర్యంలో నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com