AP: రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

AP: రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
X
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు... 44 ప్రతిపాదనలకు ఆమోదముద్ర... అభివృద్ధి, పెట్టుబడులకు పచ్చజెండా... నీటి పథకాలకు ఆమోదం తెలిపిన కేబినెట్.. అమరావతిలో పరిశ్రమలకు పచ్చజెండా

ఏపీ మం­త్రి­వ­ర్గం కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కుం­ది. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన సచి­వా­ల­యం­లో జరి­గిన కే­బి­నె­ట్ సమా­వే­శం­లో పలు కీలక అం­శా­ల­పై చర్చిం­చి.. ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. దా­దా­పు 44 అజెం­డా అం­శా­ల­తో రా­ష్ట్ర మం­త్రి­వ­ర్గ సమా­వే­శం జరి­గిం­ది. రూ.9,500 కో­ట్ల­తో 506 ప్రా­జె­క్టు­ల­కు పరి­పా­లన అను­మ­తు­ల­కు కే­బి­నె­ట్ ఆమోద ము­ద్ర వే­సిం­ది. పు­ర­పా­లక, పట్ట­ణా­భి­వృ­ద్ధి శా­ఖ­లో సమ­గ్ర నీటి ని­ర్వ­హ­ణ­కు సం­బం­ధిం­చిన ప్రా­జె­క్టు­లు, అమ­రా­వ­తి­లో లో­క్‌­భ­వ­న్‌, అసెం­బ్లీ దర్బా­ర్‌ హా­ల్‌ ని­ర్మా­ణా­ని­కి కే­బి­నె­ట్ గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది.

నీటి ప్రాజెక్టులకు ఆమోదముద్ర

వి­విధ రం­గా­ల్లో అభి­వృ­ద్ధి, పె­ట్టు­బ­డు­లు, మౌ­లిక వస­తుల సృ­ష్టి­కి సం­బం­ధిం­చి పలు ప్ర­తి­పా­ద­న­ల­కు కే­బి­నె­ట్ ఆమో­దం తె­లి­పిం­ది. రా­ష్ట్రం­లో­ని నీ­టి­ప­థ­కాల అభి­వృ­ద్ధి కోసం భా­రీ­గా రూ.9,514 కో­ట్ల వి­లు­వైన 506 ప్రా­జె­క్టు­ల­కు ఆమో­దం లభిం­చిం­ది. త్రా­గు­నీ­రు, సా­గు­నీ­రు వి­భా­గా­ల్లో ఈ ప్రా­జె­క్టు­లు రా­ష్ట్రా­ని­కి ఎంతో ఉప­యో­గ­క­రం­గా ని­ల­వ­ను­న్నా­య­ని ప్ర­భు­త్వం తె­లి­పిం­ది. పరి­శ్ర­మల వి­స్త­ర­ణ­లో భా­గం­గా, ప్ర­ముఖ వి­రూ­పా­క్ష ఆర్గా­ని­క్స్ సం­స్థ­కు 100 ఎక­రాల భూ­మి­ని కే­టా­యిం­చేం­దు­కు కే­బి­నె­ట్ గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చిం­ది. అమ­రా­వ­తి­లో పె­ట్టు­బ­డు­ల­కు వేగం చే­రేం­దు­కు ఐదు కం­పె­నీల ప్రా­జె­క్టు­ల­కు కూడా సమా­వే­శం ఆమో­దం తె­లి­పిం­ది. రి­ల­య­న్స్ కన్జ్యూ­మ­ర్ యూ­ని­ట్ ఏర్పా­టు నే­ప­థ్యం­లో సం­స్థ­కు ప్ర­త్యేక ప్రో­త్సా­హ­కా­లు­ను ప్ర­భు­త్వం ఇవ్వా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. అమ­రా­వ­తి రా­జ­ధా­ని­లో గవ­ర్న­ర్ బం­గ్లా, దర్బా­ర్ హాల్, గె­స్ట్‌­హౌ­స్‌ల ని­ర్మా­ణా­ని­కి సం­బం­ధిం­చి బి­డ్డిం­గ్ ప్ర­క్రి­య­కు అను­మ­తు­లు మం­జూ­ర­య్యా­యి. రా­జ­ధా­ని ని­ర్మాణ ప్ర­ణా­ళి­క­లో భా­గం­గా ఇవి కీలక ముం­ద­డు­గు­లు­గా భా­వి­స్తు­న్నా­రు. వై­జా­గ్–చె­న్నై ఇం­డ­స్ట్రి­య­ల్ కా­రి­డా­ర్ పను­ల­కు కే­బి­నె­ట్ పూ­ర్తి ఆమో­దం తె­లి­పిం­ది. పా­రి­శ్రా­మిక అభి­వృ­ద్ధి­కి ఇది పె­ద్ద ఊత­మి­వ్వ­నుం­ది. కు­ప్పం ని­యో­జ­క­వ­ర్గం­లో పా­ల­ర్ నది­పై నా­లు­గు చె­క్‌­డ్యా­మ్‌ల ని­ర్మా­ణా­ని­కి సం­బం­ధిం­చి సవ­రిం­చిన అను­మ­తు­ల­కు కూడా కే­బి­నె­ట్ అం­గీ­కా­రం తె­లి­పిం­ద­ని మం­త్రి పా­ర్థ­సా­ర­థి తె­లి­పా­రు.

కీలక నిర్ణయాలు ఇవే..

* సీడ్ యాక్సెస్ రహదారిని 16వ హైవేకి అనుసంధాన పనులకు రూ.532 కోట్లకు కేబినెట్ ఆమోదం.

* కుప్పంలో పాలేరు నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఓకే

* గిరిజన సంక్షేమశాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతికి గ్రీన్ సిగ్నల్

* ఆంధ్రప్రదేశ్‌ ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ సర్వీసెస్‌ ముసాయిదా బిల్లుపై కేబినెట్‌లో చర్చ, ఆమోదం

* ఎస్‌ఐపీబీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

* రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం

* రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 26 సంస్థలకు ఏపీ కేబినెట్ ఆమోదం

ఉపా­ధ్యాయ వి­భా­గా­ని­కి సం­బం­ధిం­చిన ఒక ము­ఖ్య ని­ర్ణ­యం ప్ర­కా­రం, 417 మంది భాషా పం­డి­ట్‌­ల­ను స్కూ­ల్ అసి­స్టెం­ట్లు­గా పదో­న్న­తి ఇవ్వా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. దీం­తో స్కూ­ళ్ల­లో భాషా బోధన నా­ణ్యత మరింత మె­రు­గు­ప­డ­ను­న్న­ద­ని వి­ద్యా­శాఖ భా­వి­స్తోం­ది. ఈ సమా­వే­శం­లో తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­లు రా­ష్ట్రం­లో పె­ట్టు­బ­డు­లు, మౌ­లిక వస­తు­లు, నీటి వన­రు­లు, వి­ద్య తది­తర రం­గా­ల్లో వే­గ­వం­త­మైన పు­రో­గ­తి­కి దో­హ­దం చే­య­ను­న్నా­యి. వి­శా­ఖ­ప­ట్నం­లో రు­షి­కొం­డ­లో ని­ర్మిం­చిన ప్యా­లె­స్ ను వి­ని­యో­గం­లో­కి తీ­సు­కు­రా­వ­డం­పై కూడా సీఎం చర్చిం­చా­ర­ని సమా­చా­రం. అం­దు­కు సం­బం­ధిం­చిన కే­బి­నె­ట్ సబ్ కమి­టీ ఏర్పా­టైం­ద­ని.. దాని ని­వే­ది­క­పై చర్చిం­చి త్వ­ర­లో­నే ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల్సి ఉం­ద­ని సీఎం మం­త్రు­ల­కు సూ­చిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. అదే వి­ధం­గా పర్యా­టక రంగ అభి­వృ­ద్ధి కోసం పర్యా­టక శాఖ, దే­వా­దాయ, అటవీ శా­ఖ­లు సమ­న్వ­యం­తో పని­చే­సి ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చు­కో­వా­ల­ని సీఎం సూ­చిం­చా­రు. రె­వె­న్యూ అను­బంధ సమ­స్య­ల­పై కూడా కే­బి­నె­ట్ సమా­వే­శం­లో చర్చ జరి­గిం­ది. వాటి పరి­ష్కా­రా­ని­కి ని­ర్ణీత వ్య­వ­ధి­ని పె­ట్టు­కొ­ని పని­చే­యా­ల­ని సీఎం సూ­చిం­చా­రు.

Tags

Next Story