Eluru : ఏలూరు కౌంటింగ్ కి హైకోర్టు అనుమతి..!

Eluru : ఏలూరు కౌంటింగ్ కి హైకోర్టు అనుమతి..!
పచ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల కౌటింగ్ కి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మార్చి 10న ఏలూరులో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.

పచ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల కౌటింగ్ కి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మార్చి 10న ఏలూరులో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 56.86శాతం పోలింగ్ నమోదైంది. ఏలూరు పరిధిలోని వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో గందరగోళ పరిస్థితి ఉందని, ఎన్నికలు నిలిపివేయాలంటూ పలువురు గతంలో హైకోర్టును ఆశ్రయించారు.. దీనిపై సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టి ఎన్నికలు నిలివేయాలని ఆదేశించారు. అయితే దీనిపైన ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. అటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ చేపట్టాలని ఈసీ వర్గాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story