AP: భారీ ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం

AP: భారీ ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం
X
కోనసీమ జిల్లా రాయవరంలో విషాదం.. టపాసుల కేంద్రంలో భారీ పేలుడు.. మంటల్లో ఏడుగురు సజీవ దహనం

డా­క్ట­ర్‌ బీ­ఆ­ర్‌ అం­బే­ద్క­ర్ కో­న­సీమ జి­ల్లా­లో భారీ అగ్ని­ప్ర­మా­దం సం­భ­విం­చిం­ది. రా­య­వ­రం­లో­ని గణ­ప­తి గ్రాం­డ్‌ బా­ణ­సం­చా తయా­రీ కేం­ద్రం­లో భారీ పే­లు­డు సం­భ­విం­చిం­ది. దీం­తో పె­ద్ద ఎత్తున మం­ట­లు ఎగ­సి­ప­డ్డా­యి. మం­ట­ల్లో చి­క్కు­కు­ని ఏడు­గు­రు సజీవ దహ­న­మ­య్యా­రు. మరి­కొం­ద­రి­కి గా­యా­ల­య్యా­యి. తీ­వ్రం­గా గా­య­ప­డిన ఇద్ద­రి­ని అన­ప­ర్తి ఆస్ప­త్రి­కి తర­లిం­చి చి­కి­త్స అం­ది­స్తు­న్నా­రు. మి­గి­లిన వా­రి­ని ప్రై­వే­టు ఆస్ప­త్రు­ల­కు తర­లిం­చా­రు. మృ­తు­ల్లో నలు­గు­రు మహి­ళ­లు ఉన్న­ట్లు అధి­కా­రు­లు గు­ర్తిం­చా­రు. బా­ణ­సం­చా పరి­శ్రమ యజ­మా­ని సత్తి­బా­బు కూడా మర­ణిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. మరి­కొం­ద­రి­కి గా­యా­ల­య్యా­యి. తీ­వ్రం­గా గా­య­ప­డిన ఇద్ద­రి­ని అన­ప­ర్తి ఆస్ప­త్రి­కి తర­లిం­చి చి­కి­త్స అం­ది­స్తు­న్నా­రు. మి­గి­లిన వా­రి­ని ప్రై­వే­టు ఆస్ప­త్రు­ల­కు తర­లిం­చా­రు. అగ్ని­మా­పక సి­బ్బం­ది ఘట­నా­స్థ­లి­కి చే­రు­కు­ని సహా­యక చర్య­లు చే­ప­ట్టా­రు. ప్ర­మా­దం జరి­గిన సమ­యం­లో 40 మంది కా­ర్మి­కు­లు అం­దు­లో పని­చే­స్తు­న్నా­రు. భారీ పే­లు­డు ధా­టి­కి బా­ణ­సం­చా తయా­రీ కేం­ద్రం షె­డ్డు గోడ కూ­లిం­ది. శి­థి­లాల కింద మరి­కొం­ద­రు ఉం­డొ­చ్చ­ని సమా­చా­రం. ఘట­నా­స్థ­లి­ని రా­మ­చం­ద్ర­పు­రం ఆర్డీ­వో అఖిల పరి­శీ­లిం­చా­రు. ఈ ఘట­న­పై జి­ల్లా కలె­క్ట­ర్‌ మహే­శ్‌­కు­మా­ర్‌ స్పం­దిం­చా­రు. వారం క్రి­త­మే బా­ణ­సం­చా తయా­రీ కేం­ద్రా­న్ని పో­లీ­సు­లు, రె­వె­న్యూ సి­బ్బం­ది పరి­శీ­లిం­చి అన్ని రక్షణ చర్య­లు ఉన్న­ట్లు ని­వే­దిక ఇచ్చి­న­ట్లు తె­లి­పా­రు. అగ్ని­ప్ర­మాద ని­వా­రణ పరి­క­రా­ల­ను గో­దా­ము యజ­మా­ను­లు సక్ర­మం­గా వి­ని­యో­గిం­చా­రా? లేదా? అనే వి­ష­యా­న్ని పరి­శీ­లి­స్తు­న్నా­మ­ని చె­ప్పా­రు.

చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

బా­ణ­సం­చా పే­లు­డు ఘట­న­పై సీఎం చం­ద్ర­బా­బు ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. దీ­ని­పై అధి­కా­రు­ల­తో ఆయన మా­ట్లా­డా­రు. ప్ర­మా­దం­లో పలు­వు­రు చని­పో­వ­డం­పై సీఎం ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. ప్ర­మా­దా­ని­కి గల కా­ర­ణా­లు, ప్ర­స్తుత పరి­స్థి­తి, సహా­య­క­చ­ర్య­లు, వై­ద్య­సా­యం­పై వి­వ­రా­ల­ను అధి­కా­రుల నుం­చి ఆయన తె­లు­సు­కు­న్నా­రు. ఘట­నా­స్థ­లి­కి వె­ళ్లి సహా­య­క­చ­ర్య­ల్లో పా­ల్గొ­నా­ల­ని చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­రు. మరో­వై­పు ఈ ఘట­న­పై హోం­మం­త్రి అనిత ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. క్ష­త­గా­త్రు­ల­కు మె­రు­గైన వై­ద్యం అం­దిం­చా­ల­ని ఆదే­శిం­చా­రు. బా­ధిత కు­టుం­బా­ల­ను అన్ని వి­ధా­లు­గా ఆదు­కుం­టా­మ­ని మం­త్రి తె­లి­పా­రు.

కోనసీమ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి

డా­క్ట­ర్ బీ­ఆ­ర్ అం­బే­డ్క­ర్ కో­న­సీమ జి­ల్లా­లో జరి­గిన అగ్ని­ప్ర­మా­దం­లో ఆరు­గు­రు దు­ర్మ­ర­ణం చెం­దా­రు­రు. ఈ ఘట­న­పై వై­సీ­పీ అధి­నేత, మాజీ సీఎం వై­ఎ­స్ జగన్ మో­హ­న్ రె­డ్డి ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. మృ­తుల కు­టుం­బా­ల­కు ప్ర­గాఢ సా­ను­భూ­తి తె­లి­పా­రు. ప్ర­మా­దం­లో ఆరు­గు­రు మృతి చెం­ద­డం అత్యంత వి­షా­ద­క­ర­ణ­మ­న్నా­రు. క్ష­త­గా­త్రు­ల­కు మె­రు­గైన వై­ద్యం అం­దిం­చా­ల­ని ప్ర­భు­త్వా­ని­కి జగన్ వి­జ్ఞ­ప్తి చే­శా­రు. బా­ధిత కు­టుం­బా­ల­ను ప్ర­భు­త్వం ఆదు­కో­వా­ల­ని.. అం­డ­గా ని­ల­వా­ల­ని జగన్ కో­రా­రు.

Tags

Next Story