AP: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జాతర

AP: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జాతర
X
పెట్టుబడుల్లో ఏపీ రికార్డుల మోత.. 35 సంస్థలతో చంద్రబాబు ఒప్పందాలు.. 6 సంస్థలతో ఒప్పందాలు ఇప్పటికే పూర్తి

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రా­ని­కి పె­ట్టు­బ­డు­లు ఆక­ర్షిం­చేం­దు­కు, యు­వ­త­కు ఉద్యో­గా­లు కల్పిం­చేం­దు­కు సీ­ఐ­ఐ­తో కలి­సి 30వ పె­ట్టు­బ­డి­దా­రుల భా­గ­స్వా­మ్య సద­స్సు-2025ను కూ­ట­మి ప్ర­భు­త్వం ని­ర్వ­హిం­చ­నుం­ది. నేడు, రేపు వి­శాఖ ఆం­ధ్ర వి­శ్వ­వి­ద్యా­ల­యం ఇం­జ­నీ­రిం­గ్‌ కా­లే­జీ వే­ది­క­గా ఈ సద­స్సు జర­గ­నుం­ది. అయి­తే, ఈ సద­స్సు ప్రా­రం­భం కా­వ­డా­ని­కి ముం­దే ఏపీ సర్కా­ర్ రి­కా­ర్డుల మోత మో­గి­స్తోం­ది. వి­శా­ఖ­ప­ట్నా­న్ని ‘గ్లో­బ­ల్‌ ట్రే­డ్‌ గే­ట్‌­వే’గా మా­ర్చ­డా­ని­కి రా­ష్ట్ర ప్ర­భు­త్వం ‘ఇన్వె­స్ట్‌ ఇన్‌ ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌’ అనే ని­నా­దం­తో చే­ప­ట్టిన కా­ర్య­క్ర­మం ప్రా­రం­భా­ని­కి ముం­దే లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు ఏపీ­కి తర­లి­వ­స్తు­న్నా­యి. సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు­కు ఒక్క రోజు ముం­దు­గా­నే 35 సం­స్థ­ల­తో చం­ద్ర­బా­బు సర్కా­ర్ ఎం­వో­యూ­లు కు­దు­ర్చు­కుం­టోం­ది. మొ­త్తం రూ.3.65 లక్షల కో­ట్ల వి­లు­వైన పె­ట్టు­బ­డు­ల­కు ఒప్పం­దా­లు చకా­చ­కా జరి­గి­పో­తు­న్నా­యి. వీటి ద్వా­రా ఏకం­గా 1.26 లక్షల మం­ది­కి ఉద్యో­గా­వ­కా­శా­లు కల్పిం­చ­ను­న్నా­రు. ఇవాళ(గు­రు­వా­రం) ఉదయం నుం­చి ఇప్ప­టి­వ­ర­కూ 6 సం­స్థ­ల­తో సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు ఆధ్వ­ర్యం­లో ఎం­వో­యూ­లు జరి­గా­యి.

సీఎంతో తైవాన్ బృందం భేటీ..

పె­ట్టు­బ­డుల సద­స్సు­లో భా­గం­గా వి­శా­ఖ­కు వచ్చిన తై­వా­న్‌ బృం­దం సీ­ఎం­తో భేటీ అయిం­ది. తైపీ ఎక­నా­మి­క్‌ అం­డ్‌ కల్చ­ర్‌ సెం­ట­ర్ ప్ర­తి­ని­ధి, రా­య­బా­రి ము­మి­న్‌ చె­న్‌ నే­తృ­త్వం­లో­ని బృం­దం చం­ద్ర­బా­బు­ను కలి­సిం­ది. వి­విధ రం­గా­ల్లో వచ్చే ప్రా­జె­క్టు­ల­కు అను­కూ­లం­గా ఏపీ­లో పా­రి­శ్రా­మిక కా­రి­డా­ర్ల­ను తీ­ర్చి­ది­ద్దు­తు­న్నా­మ­ని తై­వా­న్‌ బృం­దా­ని­కి సీఎం తె­లి­పా­రు. నై­పు­ణ్యం ఉన్న మానవ వన­రు­లు, ప్ర­పం­చ­స్థా­యి ప్ర­మా­ణా­ల­తో మౌ­లిక సదు­పా­యా­ల­ను కల్పి­స్తు­న్నా­మ­న్నా­రు. తై­వా­న్ కం­పె­నీ­లు ఎల­క్ట్రా­ని­క్స్, సెమీ కం­డ­క్ట­ర్లు, గ్రీ­న్ ఎన­ర్జీ, ఎల­క్ట్రి­క్ వా­హ­నాల తయా­రీ, ఈవీ బ్యా­ట­రీ తది­తర రం­గా­ల్లో ఏపీ­తో కలి­సి పని చే­యా­ల­ని సీఎం తై­వా­న్ కం­పె­నీ­ల­ను ఆహ్వా­నిం­చా­రు. ఇండో-తై­వా­న్ ఇం­డ­స్ట్రి­య­ల్ పా­ర్కు­ను కు­ప్పం­లో ఏర్పా­టు చే­సేం­దు­కు ఆస­క్తి­గా ఉన్న­ట్టు తై­వా­న్ ప్ర­తి­ని­ధి బృం­దం తె­లి­పిం­ది. అలీ­జి­య­న్స్ గ్రూ­ప్ రూ.400 కో­ట్ల వ్య­యం­తో ఈ పా­రి­శ్రా­మిక పా­ర్కు ఏర్పా­టు చే­సేం­దు­కు సి­ద్ధ­మ­ని సీ­ఎం­కు వె­ల్ల­డిం­చిం­ది.

పెట్టుబడుల ప్రవాహం..

రె­న్యూ పవర్ రూ.60 వేల కో­ట్లు, eJoule రూ.19,000 కో­ట్లు, తై­వా­న్ ప్రై­వే­ట్ ఇం­డ­స్ట్రీ­య­ల్ పా­ర్క్ రూ.1,200 కో­ట్లు, కో­ర­మాం­డ­ల్ రూ.2,000 కో­ట్లు, హీరో ఫ్యూ­చ­ర్ ఎన­ర్జీ రూ.15,000 కో­ట్లు, JOOL రూ.1,500 కో­ట్లు పె­ట్టు­బ­డు­ల­పై ఇప్ప­టి­వ­ర­కూ ఒప్పం­దా­లు జరి­గా­యి. మరో 29 సం­స్థ­ల­తో రా­ష్ట్ర ప్ర­భు­త్వం నేడు ఒప్పం­దా­లు చే­సు­కో­నుం­ది. ఏపీ సీ­ఆ­ర్డీఏ 8 ఎం­వో­యూ­లు, ఇంధన రం­గం­లో 5, ఫుడ్ ప్రా­సె­సిం­గ్ 4, ఐ అండ్ ఐ 3, ఇం­డ­స్ట్రీ­స్‌­లో 9 ఒప్పం­దా­ల­ను రా­ష్ట్ర ప్ర­భు­త్వం చే­సు­కుం­టోం­ది. కాగా, రె­న్యూ పవర్ ఈ ఏడా­ది మే­లో­నే రూ.22 వేల కో­ట్లు పె­ట్టు­బ­డు­లు పె­ట్టేం­దు­కు అం­గీ­క­రిం­చిం­ది. దీం­తో ఈ ఒక్క సం­స్థ పె­ట్టు­బ­డు­లే రూ.82 వేల కో­ట్ల­కు చే­రా­యి.

రెన్యూ పవర్‌ సంస్థ ఎంవోయూ

గత ప్ర­భు­త్వం­లో రా­ష్ట్రం నుం­చి వె­ళ్లి­పో­యిన పరి­శ్ర­మ­లు తి­రి­గి ఏపీ­లో పె­ట్టు­బ­డు­లు పె­ట్టేం­దు­కు సం­సి­ద్ధత వ్య­క్తం చే­స్తు­న్నా­య­ని మం­త్రి లో­కే­శ్‌ ప్ర­క­టిం­చా­రు. ఇం­దు­లో భా­గం­గా.. ఇం­ధ­న­రం­గం­లో రె­న్యూ పవ­ర్‌ సం­స్థ రూ.82వేల కో­ట్ల పె­ట్టు­బ­డి పె­ట్టేం­దు­కు సీఎం చం­ద్ర­బా­బు, మం­త్రి లో­కే­శ్‌ సమ­క్షం­లో ఎం­వో­యూ­లు కు­దు­ర్చు­కుం­ది. ఈడీ­బీ­తో రూ.60 వేల కో­ట్ల వి­లు­వైన నా­లు­గు ఎం­ఓ­యూ­ల­ను రె­న్యూ పవర్ సం­స్థ ప్ర­తి­ని­ధు­లు కు­దు­ర్చు­కు­న్నా­రు. ఇవి కా­కుం­డా...గతం­లో­నే రూ. 22 వేల కో­ట్లు పె­ట్టు­బ­డు­లు పె­ట్టేం­దు­కు రె­న్యూ పవర్ సం­స్థ ముం­దు­కొ­చ్చిం­ది. ఒప్పం­దం­లో భా­గం­గా 6 GW PV ఇం­‌­గో­ట్-వే­ఫ­ర్ ప్లాం­ట్, 2 GW పం­ప్డ్ హై­డ్రో ప్రా­జె­క్ట్, 300 KTPA గ్రీ­న్ అమ్మో­ని­యా సౌ­క­ర్యం, విం­డ్, సో­లా­ర్, బ్యా­ట­రీ ఎన­ర్జీ స్టో­రే­జ్ సి­స్ట­మ్ వంటి వా­టి­ల్లో 5 GW హై­బ్రి­డ్ ప్రా­జె­క్టు­లు ఏర్పా­టు చే­య­నుం­ది. తాజా ఎం­ఓ­యూల ద్వా­రా 10 వే­ల­కు పైగా ప్ర­త్య­క్ష, పరో­క్ష ఉద్యోగ, ఉపా­ధి అవ­కా­శా­లు లభిం­చ­ను­న్నా­యి.

Tags

Next Story