AP: త్వరలో మోగనున్న స్థానిక ఎన్నికల నగారా

AP: త్వరలో మోగనున్న స్థానిక ఎన్నికల నగారా
X
స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ ప్రత్యేక దృష్టి.. మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా?...అధికార కూటమిలో సీట్ల పంచాయతీ

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­కల వేడి మళ్లీ రా­జ­కీ­యం మధ్య­కె­క్కు­తోం­ది. రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­పై వే­గం­గా అడు­గు­లు వే­స్తుం­డ­గా, అధి­కార కూ­ట­మి­లో మా­త్రం సీ­ట్ల పం­పి­ణీ­పై అం­త­ర్గత చర్చ­లు ము­దు­రు­తు­న్నా­యి. గ్రామ పం­చా­య­తీ­లు, ము­న్సి­ప­ల్ సం­స్థ­లు, ఎం­పీ­టీ­సీ స్థా­నాల ఎన్ని­క­లు కే­వ­లం పరి­పా­ల­నా ప్ర­క్రి­య­గా కా­కుం­డా, భవి­ష్య­త్ రా­జ­కీయ సమీ­క­ర­ణా­ల­కు పరీ­క్ష­గా మా­ర­ను­న్నా­య­నే అభి­ప్రా­యం రా­జ­కీయ వర్గా­ల్లో వ్య­క్త­మ­వు­తోం­ది. ఈ నే­ప­థ్యం­లో రా­ష్ట్ర ఎన్ని­కల కమి­ష­న్ ని­ర్వ­హిం­చిన తాజా సమీ­క్ష సమా­వే­శం ప్రా­ధా­న్యత సం­త­రిం­చు­కుం­ది. రా­ష్ట్ర ఎన్ని­కల కమి­ష­న­ర్ అని­ల్ చం­ద్ర పు­నే­ఠా అధ్య­క్ష­తన జరి­గిన ఈ కీలక సమా­వే­శం­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­కల సన్నా­హ­కా­ల­పై వి­స్తృత స్థా­యి­లో చర్చ జరి­గిం­ది. పం­చా­య­తీ­రా­జ్, ము­న్సి­ప­ల్ పరి­పా­లన, బీసీ సం­క్షేమ శా­ఖ­ల­కు చెం­దిన ఉన్న­తా­ధి­కా­రు­లు పా­ల్గొ­న్న ఈ సమా­వే­శం­లో గ్రామ పం­చా­య­తీ­లు, పట్టణ స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­కు సం­బం­ధిం­చిన ప్రా­థ­మిక ఏర్పా­ట్ల పు­రో­గ­తి­ని అధి­కా­రు­లు కమి­ష­న్‌­కు వి­వ­రిం­చా­రు. ఎన్ని­కల ప్ర­క్రి­య­ను గడు­వు­లో­పు పూ­ర్తి చే­య­డా­ని­కి చే­ప­ట్టా­ల్సిన చర్య­ల­పై సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు.

ప్ర­త్యే­కం­గా ఓటరు జా­బి­తాల సవరణ, వా­ర్డుల పు­న­ర్వి­భ­జన, రి­జ­ర్వే­ష­న్ల ఖరా­రు, పో­లిం­గ్ కేం­ద్రాల గు­ర్తిం­పు వంటి అం­శా­ల­పై చర్చ జరి­గి­న­ట్లు సమా­చా­రం. ఎన్ని­కల ప్ర­క్రి­య­లో ఎలాం­టి సాం­కే­తిక లేదా పరి­పా­ల­నా ఆటం­కా­లు తలె­త్త­కుం­డా ముం­ద­స్తు చర్య­లు తీ­సు­కో­వా­ల­ని ఎస్‌­ఈ­సీ అధి­కా­రు­ల­కు సూ­చిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. అన్ని శా­ఖ­లు పర­స్పర సమ­న్వ­యం­తో పని­చే­స్తే­నే ఎన్ని­క­ల­ను పా­ర­ద­ర్శ­కం­గా, సమ­ర్థ­వం­తం­గా ని­ర్వ­హిం­చ­డం సా­ధ్య­మ­వు­తుం­ద­ని సమా­వే­శం­లో అభి­ప్రా­య­ప­డి­న­ట్లు తె­లి­సిం­ది. ప్రీ-ఎల­క్ష­న్ పను­ల్లో ఆల­స్యం జర­గ­కుం­డా చర్య­లు వే­గ­వం­తం చే­యా­ల­ని అని­ల్ చం­ద్ర పు­నే­ఠా అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చి­న­ట్లు సమా­చా­రం. ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­కు సం­బం­ధిం­చిన ప్ర­తి దశను ని­ర్ది­ష్ట గడు­వు­లో­పు పూ­ర్తి చే­యా­ల­ని ఆయన స్ప­ష్టం చే­సి­న­ట్లు అధి­కార వర్గా­లు చె­బు­తు­న్నా­యి. రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం వే­గం­గా కస­ర­త్తు ప్రా­రం­భిం­చ­డం­తో రా­జ­కీయ పా­ర్టీ­ల్లో కూడా ఎన్ని­కల చర్చ మళ్లీ చు­రు­గ్గా సా­గు­తోం­ది. అయి­తే ఎన్ని­కల ని­ర్వ­హణ పరం­గా అధి­కార కూ­ట­మి­కి పరి­స్థి­తి అంత సు­ల­భం­గా కని­పిం­చ­డం లేదు. సా­ర్వ­త్రిక ఎన్ని­క­ల్లో టీ­డీ­పీ, జన­సేన, బీ­జే­పీ కలి­సి ఘన వి­జ­యం సా­ధిం­చి­న­ప్ప­టి­కీ, స్థా­నిక సం­స్థల ఎన్ని­కల సమ­యం­లో క్షే­త్ర­స్థా­యి­లో సీ­ట్ల సర్దు­బా­టు ప్ర­ధాన సవా­ల్‌­గా మారే అవ­కా­శా­లు కని­పి­స్తు­న్నా­యి. ము­ఖ్యం­గా గ్రా­మ­స్థా­యి రా­జ­కీ­యా­ల్లో ప్ర­తి సీటు ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా మా­రు­తుం­డ­టం­తో కూ­ట­మి పా­ర్టీల మధ్య పోటీ పె­రు­గు­తోం­ది.

పట్టు బిగించేందుకు పార్టీలు సిద్ధం

జనసేన, బీజేపీలు ఈసారి గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశాల కోసం పట్టుబట్టే పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి విజయానికి తమ పాత్ర కీలకమైందని భావిస్తున్న ఆ రెండు పార్టీలు, ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా తగిన ప్రాధాన్యం కావాలని కోరుతున్నాయి. ముఖ్యంగా జనసేన నాయకత్వం గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని చాటుకునేందుకు ఈ ఎన్నికలను కీలక అవకాశంగా చూస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో గౌరవప్రదమైన వాటా కావాలని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అటు బీజేపీ కూడా ఈ ఎన్నికలను రాష్ట్రంలో తన సంస్థాగత బలం పెంచుకునే అవకాశంగా భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక స్థాయిలో తన ప్రభావాన్ని విస్తరించాలని కమలనాథులు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపిణీ సున్నిత అంశంగా మారుతోంది. గత ఐదే­ళ్లు­గా క్షే­త్ర­స్థా­యి­లో వై­ఎ­స్సా­ర్‌­సీ­పీ ప్ర­భు­త్వా­న్ని ఎదు­ర్కొం­టూ పా­ర్టీ­ని ని­ల­బె­ట్టిన తమకే ఇప్పు­డు అవ­కా­శా­లు తగ్గి­పో­తా­యే­మో­న­న్న ఆం­దో­ళన కా­ర్య­క­ర్త­ల్లో కని­పి­స్తోం­ది.

Tags

Next Story