AP: అర్హులకే నామినేటెడ్ పదవులు
ఏపీ ప్రభుత్వం రెండో విడతలో పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీచేసింది. టీడీపీ నుంచి 48, జనసేన నుంచి 10, బీజేపీ నుంచి ముగ్గురికి మొత్తం 62 మందికి పదవులను ప్రకటించింది. వీరితోపాటు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును నైతికవిలువల సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించింది. మొదటివిడతలో 20 కీలక కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించగా ఈసారి వివిధ సామాజికవర్గాల సంక్షేమ, అభివృద్ధి సంస్థలు, పలు పట్టణాభివృద్ధి సంస్థలు సహా వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించింది. శాసనమండలి మాజీ ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ను ప్రభుత్వ సలహాదారు (మైనారిటీ వ్యవహారాలు)గా నియమించింది. తెదేపా అధికార ప్రతినిధులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, ఆనం వెంకటరమణారెడ్డికి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీలు అప్పగించింది.
చాగంటికి కీలక పదవి
రాజకీయాలకు అతీతంగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే సలహాదారు పదవిలో కేబినెట్ ర్యాంక్తో నియమించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయనకు సాంస్కృతిక సలహాదారుడి పదవి ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ కు ముస్లిం మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా కేబినెట్ ర్యాంక్తో నియమించారు. 3 రాజధానుల బిల్లును ఆమోదించాలంటూ గత ప్రభు త్వం ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా, మంత్రులు వ్యక్తిగత దూషణలకు దిగినా విధి నిర్వహణలో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి బీసీలు, వివిధ సామాజిక వర్గాలు, సీనియర్లు, యువతకు ఈ జాబితా లో స్థానం దక్కింది. బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న వీరంకి గురుమూర్తిని ఏపీ గౌడ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించారు. టీడీపీ నాయకురాలు మంజులారెడ్డికి శిల్పారామం, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సాంస్కృతిక సొసైటీ చైర్పర్సన్ పదవి దక్కింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల పోలింగ్ బూత్కు ఏజెంట్గా వెళ్తున్న మంజులారెడ్డిని పిన్నెల్లి ముఠా దారికాచి కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి నా ఆమె తలకు కట్టు కట్టుకుని మరీ పార్టీ కోసం పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పలుమార్లు భౌతికదాడులను ఎదుర్కొని పార్టీకి పనిచేసిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులను ఏకం చేసి పోరాడిన పొడపాటి తేజస్వినికి నామినేటెడ్ పదవులు దక్కాయి. పార్టీ అధినేత వాహనశ్రేణికి పైలట్గా స్కూటర్పై వేల కిలోమీటర్లు ప్రయాణించిన దివ్యాంగుడు గోనుగుంట్ల కోటేశ్వరరావుకు నామినేటెడ్ పదవి లభించింది.
బీసీలకు ప్రాధాన్యత
నామినేటెడ్ పదవుల రెండో జాబితాను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో 59 మందికి నామినేటెడ్ పదవులు దక్కాయి. కార్పొరేషన్ పదవుల్లో పార్టీల వారీగా టీడీపీకి 45, జనసేన 10, బీజేపీ నుంచి నలుగురికి పదవులు దక్కాయి. మరోవైపు నామినేటెడ్ పదవుల జాబితాలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారికి, గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి పదవులు దక్కినట్లు తెలుస్తోంది.
ఆమె తెగువకు నామినేటెడ్ పదవి
ఏపీ ఎన్నికల పోలింగ్ రోజున పల్నాడులో చెలరేగిన హింసలో ఓ మహిళ సాహసం అందర్నీ ఆకర్షించింది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల్లో ఓ పోలింగ్ బూత్లో మంజులారెడ్డి టీడీపీ ఏజెంట్గా ఉన్నారు. వైసీపీ నేతలు బూత్ కు వెళ్తున్న మంజులపై దాడిచేసి గొడ్డలితో ఆమె తలపై వేటు వేశారు. తలపై గాయమైనా ఆమె వెనక్కి తగ్గలేదు. అప్పుడు ఆమె చూపిన తెగువకు ఇప్పుడు ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com