Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసుల నోటీసులు

X
By - TV5 Digital Team |24 Nov 2021 3:45 PM IST
Chandrababu : తిరుపతిలో రాయలచెరువును పరిశీలించేందుకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు నోటీసులిచ్చారు.
Chandrababu : తిరుపతిలో రాయలచెరువును పరిశీలించేందుకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు నోటీసులిచ్చారు. రాయలచెరువుకు వెళ్లేందుకు చంద్రబాబుకు అనుమతిలేదంటూ నోటీసులో పేర్కొన్నారు. కానీ... తాను రాయలచెరువును పరిశీలించి తీరుతానని బయల్దేరారు చంద్రబాబు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు. పరిశీలనకు వస్తే... ఎందుకు ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com