AP: విశాఖ సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు

AP: విశాఖ సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు
X
ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు.. ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు

వి­శా­ఖ­లో ఈ నెల 14, 15 తే­దీ­ల­లో అత్యంత ప్ర­తి­ష్టా­త్మ­కం­గా పా­ర్ట­న­ర్ షిప్ సమ్మి­ట్-2025 ని ని­ర్వ­హి­స్తు­న్నా­రు. ఇది రా­ష్ట్ర స్థా­యి జా­తీయ స్థా­యి­లో కాదు, అం­త­ర్జా­తీయ స్థా­యి సద­స్సు. దాం­తో దా­ని­కి అను­గు­ణం­గా­నే ఏర్పా­ట్లు జరు­గు­తు­న్నా­యి. వి­శా­ఖ­లో జరి­గే సమ్మి­ట్ కోసం గత రెం­డు నెలల నుం­చి వి­స్తృ­తం­గా ఏర్పా­ట్లు జరు­గు­తు­న్నా­యి. రహ­దా­రుల సుం­ద­రీ­క­రణ నుం­చి పా­ర్కు­లు బీచ్ పరి­స­రా­లు వి­హార స్థ­లాల అలం­క­రణ వరకూ అన్నీ సి­ద్ధం చే­స్తు­న్నా­రు. ఏయూ ఇం­జి­నీ­రిం­గ్‌ మై­దా­నం­లో 13 ఎక­రా­ల్లో సద­స్సు­కు ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. ఇక్క­డే దేశ, వి­దే­శాల నుం­చి వచ్చే ప్ర­తి­ని­ధు­లు ప్ర­భు­త్వం­తో 410 ఒప్పం­దా­లు చే­సు­కో­ను­న్న­ట్లు ఉన్న­తా­ధి­కా­రు­లు తె­లి­పా­రు. ఈ మే­ర­కు సు­మా­రు రూ.9.80 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు వస్తా­య­ని ప్ర­భు­త్వం అం­చ­నా వే­స్తోం­ది. అదే సమ­యం­లో రూ.2.70 లక్షల కో­ట్ల­తో చే­ప­ట్ట­ను­న్న ప్రా­జె­క్టు­ల­కు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు శం­కు­స్థా­ప­న­లు చే­య­ను­న్నా­రు. సద­స్సు­కు ఈనెల 9వ తే­దీ­లో­గా పో­ర్ట­ల్‌ ద్వా­రా రి­జి­స్ట్రే­ష­న్ల ప్ర­క్రియ పూ­ర్త­య్యే­లా చూ­స్తు­న్నా­రు. హా­జ­ర­య్యే ప్ర­తి­ని­ధు­ల­కు ఇచ్చిన గు­ర్తిం­పు కా­ర్డు­ల­పై ప్ర­త్యేక క్యూ­ఆ­ర్‌ కో­డ్‌ ఉం­టుం­ది. దా­ని­నే సె­క్యూ­రి­టీ తని­ఖీ­ల­కు ఉప­యో­గిం­చ­ను­న్నా­రు.

ఈ అం­త­ర్జా­తీయ పె­ట్టు­బ­డుల సద­స్సు ద్వా­రా ఏకం­గా 410 దాకా ఒప్పం­ద­లౌ వి­విధ రం­గా­ల­లో పె­ట్టు­బ­డుల కోసం రా­ష్ట్ర ప్ర­భు­త్వం కు­దు­ర్చు­కో­నుం­ద­ని చె­బు­తు­న్నా­రు. అంతే కాదు లక్ష­ల­లో పె­ట్టు­బ­డు­లు కూడా వస్తా­య­ని అం­చ­నా వే­స్తు­న్నా­రు. దేశ వి­దే­శాల నుం­చి ఏకం­గా మూడు వేల మంది అతి­థు­లు హా­జ­ర­వు­తా­ర­ని అం­టు­న్నా­రు. దాం­తో ఈ భారీ సమ్మి­ట్ ని సక్సె­స్ ఫుల్ గా చే­య­డా­ని­కి కూ­ట­మి ప్ర­భు­త్వం పూ­ర్తి స్థా­యి­లో శ్ర­మి­స్తోం­ది. సమ్మి­ట్ లో 12 మల్టీ లా­ట­ర­ల్ ఆర్గ­నై­జే­ష­న్స్, 72మంది ఇం­ట­ర్నే­ష­న­ల్ స్పీ­క­ర్స్ పా­ల్గొం­టా­రు. 48 స్పీ­కిం­గ్ సె­ష­న్స్ లో సె­క్టా­ర్ల­వా­రీ­గా వి­విధ అం­శా­ల­పై వి­స్తృ­తం­గా చర్చ­లు జరు­పు­తాం. ఈసా­రి పా­ర్ట­న­ర్ షిప్ సమ్మి­ట్ లో 410 ఎం­వో­యూ­ల­పై సం­త­కం చే­య­బో­తు­న్నాం. వీ­టి­ద్వా­రా రూ.9.8లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు, 7.5లక్షల ఉద్యో­గా­వ­కా­శా­లు రా­బో­తు­న్నా­యి.

Tags

Next Story