AP: ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి

AP: ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి
X
ఏపీలో4 రాజ్యసభ ఎంపీ పదవులు ఖాళీ.. టీడీపీ నుంచి భారీగా ఆశావహుల జాబితా

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­జ­కీ­యా­ల్లో ఇప్పు­డు రా­జ్య­సభ ఎన్ని­కల చర్చ వే­డె­క్కు­తోం­ది. వచ్చే నె­ల­లో నా­లు­గు రా­జ్య­సభ స్థా­నా­లు ఖాళీ కా­నుం­డ­టం­తో అధి­కార కూ­ట­మి­లో ఇప్ప­టి­కే ఆశా­వ­హుల కద­లి­క­లు ప్రా­రం­భ­మ­య్యా­యి. ఇంకా అధి­కా­రిక ప్ర­క్రియ మొ­ద­లు­కా­క­ముం­దే పద­వుల కోసం లా­బీ­యిం­గ్ జో­రం­దు­కో­వ­డం రా­జ­కీయ వర్గా­ల్లో ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. ము­ఖ్యం­గా కూ­ట­మి­లో భా­గ­స్వా­మ్య పా­ర్టీల మధ్య సీ­ట్ల పం­ప­కా­ల­పై స్ప­ష్టత రా­క­ముం­దే నే­త­లు తమ పే­ర్లు పరి­శీ­లిం­చా­ల­ని అధి­ష్టా­నా­ల­కు వి­న­తు­లు చే­స్తు­న్న­ట్లు సమా­చా­రం. ప్ర­స్తు­తం వై­ఎ­స్సా­ర్‌­సీ­పీ నుం­చి రా­జ్య­స­భ­కు ఎన్ని­కైన పి­ల్లి సు­భా­ష్‌­చం­ద్ర­బో­స్, ఆళ్ల అయో­ధ్య­రా­మి­రె­డ్డి, పరి­మ­ళ్‌ నత్వా­నీ, సానా సతీ­ష్‌ల పద­వీ­కా­లం వచ్చే నె­ల­తో ము­గి­య­నుం­ది. ప్ర­స్తుత అసెం­బ్లీ బలా­బ­లా­ల­ను పరి­శీ­లి­స్తే ఈ నా­లు­గు స్థా­నా­లు కూడా ఎన్డీ­యే కూ­ట­మి ఖా­తా­లో­కి వె­ళ్లే అవ­కా­శా­లు స్ప­ష్టం­గా కని­పి­స్తు­న్నా­యి. అయి­తే ఈ నా­లు­గు స్థా­నా­ల­ను కూ­ట­మి­లో­ని ఏ పా­ర్టీ­కి ఎన్ని­చొ­ప్పున కే­టా­యిం­చా­ల­న్న అం­శం­పై ఇంకా తుది ని­ర్ణ­యం వె­లు­వ­డ­లే­దు.

రా­జ­కీయ వర్గా­ల్లో వి­ని­పి­స్తు­న్న చర్చల ప్ర­కా­రం రెం­డు స్థా­నా­లు తె­లు­గు­దే­శం పా­ర్టీ తీ­సు­కు­ని, మి­గ­తా రెం­డు స్థా­నా­ల­ను జన­సేన, బీ­జే­పీ­ల­కు చెరో ఒకటి చొ­ప్పున కే­టా­యిం­చే అవ­కా­శం ఉం­ద­ని ప్ర­చా­రం జరు­గు­తోం­ది. అయి­తే పరి­స్థి­తు­ల­ను బట్టి ఈ ఫా­ర్ము­లా­లో మా­ర్పు­లు ఉం­డొ­చ్చ­ని కూడా అం­టు­న్నా­రు. ము­ఖ్యం­గా బీ­జే­పీ­కి ఇప్ప­టి­కే ఏపీ నుం­చి ఇద్ద­రు రా­జ్య­సభ సభ్యు­లు ఉం­డ­టం­తో మరో­సా­రి అవ­కా­శం ఇస్తా­రా లేదా అన్న అంశం చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. ఇక టీడీపీ అంతర్గతంగా చూస్తే రాజ్యసభ రేసు మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. పార్టీ సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సీనియారిటీ, గతంలో అవకాశాలు కోల్పోయిన నేతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలువురు నేతలు తమకే అవకాశం కల్పించాలని ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్ర­స్తుత రా­జ్య­సభ సభ్యు­డు సానా సతీ­ష్ మరో­సా­రి తనకు అవ­కా­శం ఇవ్వా­ల­ని కో­రు­తు­న్న­ట్లు సమా­చా­రం. అదే సమ­యం­లో కం­భం­పా­టి రా­మ్మో­హ­న్, మాజీ ఎంపీ గల్లా జయ­దే­వ్, టీ­డీ­పీ నేత టీడీ జనా­ర్ద­న్‌, భా­ష్యం వి­ద్యా­సం­స్థల అధి­నేత భా­ష్యం రా­మ­కృ­ష్ణ పే­ర్లు కూడా ప్ర­ధా­నం­గా వి­ని­పి­స్తు­న్నా­యి. గుం­టూ­రు నుం­చి రెం­డు­సా­ర్లు ఎం­పీ­గా గె­లి­చిన గల్లా జయ­దే­వ్ మళ్లీ పా­ర్ల­మెం­ట్‌­కు వె­ళ్లా­ల­న్న ఆస­క్తి­తో ఉన్నా­ర­ని పా­ర్టీ వర్గా­లు చె­బు­తు­న్నా­యి. కీలక నేత వర్ల రా­మ­య్య పేరు కూటా చాలా బలం­గా వి­ని­పి­స్తోం­ది.

Tags

Next Story