AP: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించిన కీలక ఉత్తర్వులు ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. వచ్చే ఏడాది జరగనున్న పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇదే ప్రకటనలో ఏఏ సబ్జెక్ట్ పరీక్షలు ఏఏ తేదీల్లో జరుగుతాయనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులు ఈ షెడ్యూల్ను అనుసరించి తమ పరీక్షలకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ప్రకటనతో విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై స్పష్టత వచ్చింది. హాల్ టికెట్లు, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
పరీక్షల తేదీల పూర్తి వివరాలు
మార్చి 16: ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-1)
మార్చి 18: సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20: ఇంగ్లీష్
మార్చి 23: గణితం
మార్చి 25: ఫిజిక్స్ (భౌతికశాస్త్రం)
మార్చి 28: బయాలజీ (జీవశాస్త్రం)
మార్చి 30: సోషల్ స్టడీస్ (సాంఘికశాస్త్రం)
మార్చి 31: ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ పేపర్-2)
ఏప్రిల్ 1: OSSSC సెకండ్ లాంగ్వేజ్ (పేపర్-2
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

