AP: మే 12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

సప్లిమెంటరీ పరీక్ష తేదీలను కూడా విడుదల చేశారు. మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 15వ తేదీ నుంచి ఫీజులు చెల్లించవచ్చు. 22వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఈ పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. త్వరలో సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ అందుబాటులోకి రానుంది. ఇంటర్ ఫస్టియర్ 70 శాతం మంది ఉత్తీర్ణత నమోదు కాగా.. ఇంటర్ సెకండ్ ఇయర్ 83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ ఫలితాలు విడుదల
ఏపీ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ 70 శాతం మంది ఉత్తీర్ణత నమోదు కాగా.. ఇంటర్ సెకండ్ ఇయర్ 83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా 93 శాతంతో మొదటి స్థానంలో ఉంది. అల్లూరి, అనకాపల్లి జిల్లాలు 73 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు హాజరయ్యారు. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా ఏప్రిల్ 12న ఫలితాలను విడుదల చేయడం గమనార్హం.
అగ్రస్థానాన కృష్ణా జిల్లా
ఇంటర్ ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల హవా కొనసాగింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా 93%, గుంటూరు 91%, ఎన్టీఆర్ 89%, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా 85%, గుంటూరు 82%, ఎన్టీఆర్ 81% ఉత్తీర్ణతతో తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. రెండో సంవత్సరం ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా 73%, మొదటి ఏడాదికి సంబంధించి చిత్తూరు 54% ఉత్తీర్ణతతో అట్టడుగున ఉన్నాయి. ఎక్కువగా ఇంటర్ కళాశాలలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఉండడం, రాష్ట్రంలో పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఇక్కడే ప్రవేశాలు పొందుతుండడంతో ఈ రెండు జిల్లాల్లోనూ ఉత్తీర్ణత ఎక్కువగా నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com