AP: నెరవేరిన ఉత్తరాంధ్రవాసుల చిరకాల కోరిక

ఉత్తరాంధ్రవాసుల ఎదురుచూపులకు తెరపడింది. విజయనగరంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగింది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్లో భాగంగా విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి బయల్దేరనున్న ఎయిర్ ఇండియా విమానం భోగాపురం ఎయిర్పోర్టులో దిగింది. ఈ విమానంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు భోగాపురంలో దిగారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం దిగింది.ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురానికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు చేరుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో 300 విమానాలు దిగే సదుపాయం కల్పించింది. తొలి దశ నిర్మాణ పనులకు రూ.4,592 కోట్ల వ్యయం అయింది.
ఉత్తరాంధ్ర వాసుల కలల ప్రాజెక్టు అయిన భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో దక్షిణ భారతదేశంలో విశాఖపట్నం.. ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. విమాన సర్వీసులు, అంతర్జాతీయ అనుసంధానం, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారుతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. ముఖ గుర్తింపు ద్వారా పేపర్ లెస్ ఎంట్రీ ఉంటుంది. అలాగే 10 కంటే ఎక్కువ ఆధునిక ఏరోబ్రిడ్జిల ద్వారా నేరుగా విమాన ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సోలార్ పవర్, వర్షపు నీటి రీసైక్లింగ్ ద్వారాల లీడ్ గోల్డెన్ రేటింగ్ లక్ష్యంగా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరుగుతోంది.
భోగాపురం విమానాశ్రయం మొదటి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 1.8 కోట్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు 2025 డిసెంబర్ నాటికి భోగాపురం విమానాశ్రయం పనులు సుమారుగా 91.7 శాతం పూర్తయ్యాయి. 2026 మే లేదా జూన్ నాటికి మిగతా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతోఅధికారులు పనిచేస్తున్నారు.
భారీ ఖర్చుతో నిర్మాణాలు
భోగాపురం ఎయిర్పోర్టు తొలిదశ నిర్మాణం కోసం సుమారు 4,592 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే విమానాశ్రయానికి దగ్గరలోనే 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయం చేరుకోవటానికి ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా.. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల నుంచి రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం అభివృద్ధి చెందుతాయని అధికారులు చెప్తున్నారు. చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రాక పెరుగుతుందని.. మొత్తంగా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అత్యాధునిక సౌకర్యాలు
ఈ విమానాశ్రయంలో ఒకేసారి 300 విమానాలు దిగే సదుపాయాలు కల్పించడం విశేషం. అంతర్జాతీయ బిడ్స్ ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్బస్ A380, బోయింగ్ 747-8 వంటి భారీ విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యేలా రన్వేలను డిజైన్ చేశారు.
ప్రయాణికుల సామర్థ్యం
తొలి దశలోనే ప్రతి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న టెర్మినల్ను నిర్మించనున్నారు. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఉపయోగపడనుంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

