AP: ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

AP: ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం
X
విశాఖపట్నంలో సీఐఐ సదస్సు ఆరంభం.. తొలిరోజే భారీ ఒప్పందాలు, పెట్టుబడులు.. ఏపీ తలరాత మారుతోందన్న చంద్రబాబు

ప్ర­తి­ష్ఠా­త్మక 30వ సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు వి­శా­ఖ­లో ప్రా­రం­భ­మైం­ది. ఉప­రా­ష్ట్ర­ప­తి సీపీ రా­ధా­కృ­ష్ణ­న్‌ ఈ సద­స్సు­ను ప్రా­రం­భిం­చా­రు. గవ­ర్న­ర్‌ జస్టి­స్‌ అబ్దు­ల్‌ నజీ­ర్‌, సీఎం చం­ద్ర­బా­బు, కేం­ద్ర మం­త్రు­లు పీ­యూ­ష్‌­గో­య­ల్‌, రా­మ్మో­హ­న్‌ నా­యు­డు, పె­మ్మ­సా­ని చం­ద్ర­శే­ఖ­ర్‌, భూ­ప­తి­రా­జు శ్రీ­ని­వాస వర్మ తది­త­రు­లు పా­ల్గొ­న్నా­రు. ఈ సద­స్సు­కు సీఐఐ అధ్య­క్ష­డు రా­జీ­వ్‌ మె­మా­నీ, సీఐఐ డై­రె­క్ట­ర్‌ చం­ద్ర­జి­త్‌ బె­న­ర్జీ­తో­పా­టు దే­శ­వి­దే­శా­ల­కు చెం­దిన పా­రి­శ్రా­మి­క­వే­త్త­లు హా­జ­ర­య్యా­రు. మన దేశం శర­వే­గం­గా అభి­వృ­ద్ధి చెం­దు­తోం­ద­ని సీఐఐ అధ్య­క్షు­డు రా­జీ­వ్‌ అన్నా­రు. కేం­ద్రం సా­యం­తో ఏపీ అభి­వృ­ద్ధి­లో దూ­సు­కు­పో­తోం­ద­ని.. రా­ష్ట్రా­ని­కి అనేక పె­ట్టు­బ­డు­లు వస్తు­న్నా­య­న్నా­రు. చం­ద్ర­బా­బు సా­ర­థ్యం­లో రా­ష్ట్రం వే­గం­గా ముం­దు­కె­ళ్తోం­ద­ని జీ­ఎం­ఆ­ర్ సం­స్థ ఛై­ర్మ­న్‌ గ్రం­ధి మల్లి­ఖా­ర్జు­న­రా­వు కొ­ని­యా­డా­రు. ఉత్త­రాం­ధ్ర అభి­వృ­ద్ధి­కి భో­గా­పు­రం వి­మా­నా­శ్ర­యం ఎంతో దో­హ­దం చే­స్తుం­ద­ని వి­వ­రిం­చా­రు.

సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు­లో భా­ర­త్‌ బయో­టె­క్‌ ఎండీ సు­చి­త్ర ఎల్ల మా­ట్లా­డా­రు. వా­ణి­జ్యం­లో ఎదు­ర­య్యే సవా­ళ్లు అధి­గ­మి­స్తూ భా­ర­త్‌ ముం­దు­కె­ళ్తోం­ద­న్నా­రు. ‘‘గ్రీ­న్‌­ఎ­న­ర్జీ ఉత్ప­త్తి­లో స్వ­యం­ప్ర­తి­ప­త్తి సా­ధిం­చే­లా అడు­గు­లు వే­స్తు­న్నాం. భా­గ­స్వా­మ్యం, ఆవి­ష్క­ర­ణ­లు, వి­లువ ఆధా­రిత ఉత్ప­త్తు­ల­తో­నే ఆత్మ­ని­ర్భ­ర్‌ భా­ర­త్‌ సా­ధ్య­మ­వు­తుం­ది. కొ­వి­డ్‌ వచ్చి­న­ప్పు­డు ప్ర­పం­చా­ని­కి వ్యా­క్సి­న్‌ అం­దిం­చ­గ­లి­గాం. జీ­నో­మ్‌­వ్యా­లీ లాం­టి ఎకో­సి­స్ట­మ్‌­ను చం­ద్ర­బా­బు తయా­రు చే­శా­రు. అదే జీ­నో­మ్‌­వ్యా­లీ­లో కొ­వి­డ్‌ వ్యా­క్సి­న్‌ తయా­రు చేసి అం­దిం­చాం’’ అని సు­చి­త్ర ఎల్ల అన్నా­రు.


పాలసీలపై చర్చ

భా­గ­స్వా­మ్య సద­స్సు­లో పా­ల్గొ­న్న వి­విధ ప్ర­ముఖ సం­స్థ­ల­కు చెం­దిన పా­రి­శ్రా­మిక వే­త్త­లు ఏపీ­లో జరు­గు­తు­న్న అభి­వృ­ద్ధి గు­రిం­చి... పా­రి­శ్రా­మి­కా­భి­వృ­ద్ధి­కి సం­బం­ధిం­చి ప్ర­భు­త్వం తె­చ్చిన పా­ల­సీల గు­రిం­చి మా­ట్లా­డా­రు. అదా­నీ పో­ర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదా­నీ మా­ట్లా­డు­తూ... స్పీ­డ్ ఆఫ్ డూ­యిం­గ్ బి­జి­నె­స్‌­తో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ఆధు­ని­కం­గా మా­రు­తోం­ద­న్నా­రు. భారత దే­శం­లో వే­గం­గా ఎదు­గు­తు­న్న స్టా­ర్ట­ప్ స్టే­ట్‌­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ని­లి­చిం­ద­ని కరణ్ అదా­నీ అభి­ప్రా­య­ప­డ్డా­రు. దీ­ని­కి మా­ర్గ­ద­ర్శి­గా ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు వ్య­వ­హ­రి­స్తు­న్నా­ర­ని వె­ల్ల­డిం­చా­రు. ఏపీ­లో డేటా సెం­ట­ర్లు, ఓడ­రే­వు­లు, సి­మెం­ట్ ఉత్ప­త్తి తది­తర రం­గా­ల్లో అదా­నీ సం­స్థ పని­చే­స్తోం­ద­ని వి­వ­రిం­చా­రు. ఏపీ వృ­ద్ధి­లో అదా­నీ సం­స్థ కూడా భా­గ­స్వా­మి అవు­తోం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. నై­పు­ణ్యం ఉన్న యువత, మానవ వన­రు­లు, పా­రి­శ్రా­మిక అవ­స­రా­ల­కు అను­గు­ణం­గా ఏపీ­ని మం­త్రి నారా లో­కే­ష్ తీ­ర్చి­ది­ద్దు­తు­న్నా­ర­ని కరణ్ అదా­నీ కి­తా­బి­చ్చా­రు. ఇక జీ­ఎం­ఆ­ర్ సం­స్థ అధి­నేత గ్రం­ధి మల్లి­ఖా­ర్జున రావు మా­ట్లా­డు­తూ.. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు వి­జ­న్‌­కు అను­గు­ణం­గా ఏపీ­లో అం­త­ర్జా­తీయ స్థా­యి వి­మా­నా­శ్ర­యా­లు వస్తు­న్నా­య­న్నా­రు. భో­గా­పు­రం అం­త­ర్జా­తీయ వి­మా­నా­శ్ర­యం ని­ర్మా­ణం­లో భా­గ­స్వా­మి అయి­నం­దు­కు సం­తో­షం­గా ఉం­ద­ని జీ­ఎ­మ్మా­ర్ అధి­నేత చె­ప్పా­రు. ఇం­టి­గ్రే­టె­డ్ ఏరో స్పే­స్ ఎకో సి­స్టం­ను ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో సి­ద్ధం చే­స్తు­న్నా­మ­ని... మె­యిం­టె­నె­న్స్, రి­పే­ర్స్, ఓవర్ హా­లిం­గ్ సెం­ట­ర్ కూడా భో­గా­పు­రం ఎయి­ర్ పో­ర్టు­లో వస్తుం­ద­ని జీ­ఎ­మ్మా­ర్ సం­స్థ అధి­నేత ప్ర­క­టిం­చా­రు. ఇప్ప­టి­కే పలు కం­పె­నీ­లు ఏపీ ప్ర­భు­త్వం­తో పె­ట్టు­బ­డు­ల­పై ఒప్పం­దా­లు చే­సు­కు­న్నా­యి. మొ­త్తం 40 దే­శాల నుం­చి ప్ర­తి­ని­ధు­లు హా­జ­ర­య్యా­రు. ఒక­రో­జు ముం­దు­గా­నే ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు 15 సమా­వే­శా­ల్లో పా­ల్గొ­ని ప్ర­తి­ని­ధు­ల­తో చర్చిం­చా­రు. ఏపీ­లో పె­ట్టు­బ­డు­లు పె­ట్టేం­దు­కు రి­ల­యె­న్స్ సం­స్థ అం­గీ­కా­రం తె­లి­పిం­ది. AI డేటా సెం­ట­ర్, సో­లా­ర్ పవర్ ప్లాం­ట్, గ్రీ­న్ ఫీ­ల్డ్ ఇం­టి­గ్రే­టే­డ్ ఫుడ్ పా­ర్క్ ఏర్పా­టు చే­స్తా­మ­ని ప్ర­క­టిం­చిం­ది.

Tags

Next Story