AP: ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్ర కలకలం..ఒకరు అరెస్ట్

AP: ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్ర కలకలం..ఒకరు అరెస్ట్
X
సత్యసాయి జిల్లాలో ఉగ్రవాది అరెస్ట్... నూర్ మహమ్మద్‌పై దేశ ద్రోహం కేసు... 30 ఏళ్లుగా ధర్మవరంలోనే ముష్కరుడు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని సత్య­సా­యి జి­ల్లా­లో ఉగ్ర కద­లి­క­ల­తో తె­లు­గు రా­ష్ట్రా­లు ఒక్క­సా­రి­గా ఉలి­క్కి­ప­డ్డా­యి. ధర్మ­వ­రం­లో ఐబీ అధి­కా­రు­లు, పో­లీ­సు­లు తని­ఖీ­లు చే­శా­రు. కోట కా­ల­నీ­లో నూ­ర్‌ మహ­మ్మ­ద్‌ అనే వ్య­క్తి­ని అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. స్థా­నిక పో­లీ­సు­ల­తో కలి­సి ఐబీ అధి­కా­రు­లు అతడి ఇం­టి­ని తని­ఖీ చే­శా­రు. అక్కడ అను­మా­నిత వస్తు­వు­ల­ను స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. నూ­ర్‌ మహ­మ్మ­ద్‌ పా­కి­స్థా­న్‌­కు ఫో­న్‌ కా­ల్స్‌ చే­స్తూ అక్క­డి ఉగ్ర­వా­దు­ల­తో చా­టిం­గ్‌ చే­స్తు­న్న­ట్లు సమా­చా­రం. దీం­తో ఐబీ అధి­కా­రు­లు అత­డి­ని ప్ర­శ్ని­స్తు­న్నా­రు. నిం­ది­తు­డు ధర్మ­వ­రం మా­ర్కె­ట్‌ వీ­ధి­లో­ని టీ­స్టా­ల్‌­లో పని­చే­స్తు­న్న­ట్లు గు­ర్తిం­చా­రు. ఏపీ­లో ఉగ్ర కద­లి­క­ల­పై ని­ఘా­వ­ర్గా­లు, ఏపీ పో­లీ­సు­లు ఫో­క­స్ పె­ట్టా­రు. నూ­ర్‌ మహ­మ్మ­ద్‌­కు పా­కి­స్తా­న్‌­కు చెం­దిన జైషే మహ­మ్మ­ద్ ఉగ్ర­వాద సం­స్థ­తో లిం­కు­లు ఉన్న­ట్లు ఇం­టె­లి­జె­న్స్‌ బ్యూ­రో గు­ర్తిం­చిం­ది. భా­ర­త­దే­శం­లో ని­షే­ధిం­చిన ఉగ్ర­వాద సం­స్థ­ల­కు చెం­దిన వా­ట్స­ప్ గ్రూ­పు­ల్లో సభ్యు­డి­గా ఉన్న­ట్లు ఐబీ అధి­కా­రు­లు పే­ర్కొ­న్నా­రు. ము­స్లిం యు­వ­త­ను అతడు ఉగ్ర­వా­దం వైపు మళ్లి­స్తు­న్న­ట్లు అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు. అలా­గే.. ఏపీ­లో ఇస్లా­మి­క్‌ మూ­వ్‌­మెం­ట్‌ ఆఫ్‌ ఇం­డి­యా(సీమీ) ఉగ్ర­వాద సం­స్థ­తో సం­బం­ధా­లు ఉన్న స్టూ­డెం­ట్స్‌­ను గు­ర్తిం­చి­న­ట్లు అధి­కా­రు­లు చె­ప్పా­రు. ఏప్రి­ల్ 25న పది మంది అను­మా­ని­తు­ల­ను నిఘా వర్గా­లు గు­ర్తిం­చా­య­ని ఐబీ అధి­కా­రు­లు తె­లి­పా­రు.

ఉగ్రవాదులతో చర్చలు

ఆన్లై­న్ కా­ల్స్ ద్వా­రా పా­కి­స్తా­న్‌­లో­ని జైషే మహ­మ్మ­ద్, ఇత­రు­ల­తో నూ­ర్‌ మహ­మ్మ­ద్‌ మా­ట్లా­డి­న­ట్టు వి­వ­రిం­చా­రు. ఏపీ­లో ఇస్లా­మి­క్‌ మూ­వ్‌­మెం­ట్‌ ఆఫ్‌ ఇం­డి­యా(సీమీ) ఉగ్ర­వాద సం­స్థ­తో సం­బం­ధా­లు ఉన్న స్టూ­డెం­ట్స్‌­ను గు­ర్తిం­చి­న­ట్లు అధి­కా­రు­లు చె­ప్పా­రు. ఉగ్ర­వా­ది నూర్ మహ­మ్మ­ద్‌­పై పో­లీ­సు­లు దే­శ­ద్రో­హం కేసు నమో­దు చే­శా­రు. జైషే మహ­మ్మ­ద్ ఉగ్ర­వాద సం­స్థ­తో నూర్ మహ­మ్మ­ద్ క్రి­యా­శీల వ్య­క్తి­గా ఉన్న­ట్లు ని­ర్ధా­రణ అయిం­ది. ధర్మ­వ­రం రూ­ర­ల్ మం­డ­లా­ని­కి చెం­దిన యు­వ­కు­డు రి­యా­జ్ తన వా­ట్స­ప్‌­లో పా­కి­స్థా­న్‌­కు మద్ద­తు­గా ఆ దేశ జెం­డా­తో పాక్ ఇన్ఫు­యె­న్స­ర్ సయ్య­ద్ బి­లా­ల్ వీ­డి­యో­ను స్టే­ట­స్‌­గా పె­ట్టు­కు­న్నా­రు. నూర్ మహ­మ్మ­ద్‌­ను వి­చా­రి­స్తు­న్న సమ­యం­లో మరో యు­వ­కు­డి పేరు కూడా బయ­ట­కు వచ్చిం­ది. దీం­తో పో­లీ­సు­లు అత­న్ను వి­చా­రిం­చి వది­లి­పె­ట్టా­రు. మే 18న విజయనగరంలో ఉగ్ర కుట్రలను ఏపీ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న సిరాజ్, సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఉగ్ర కార్యకలాపాలపై ఏపీ పోలీసులు , NIA సంయుక్తంగా విచారణ చేపట్టింది.

Tags

Next Story