Ap: మద్యం కుంభకోణంపై పార్లమెంట్‌లో గళమెత్తుతాం

Ap: మద్యం కుంభకోణంపై పార్లమెంట్‌లో గళమెత్తుతాం
X

జగ­న్‌ హయాం­లో ఏపీ­లో జరి­గిన మద్యం కుం­భ­కో­ణం­పై పా­ర్ల­మెం­ట్‌ వే­ది­క­గా గళం వి­ప్పు­తా­మ­ని టీ­డీ­పీ ఎంపీ లావు శ్రీ­కృ­ష్ణ­దే­వ­రా­య­లు తె­లి­పా­రు. నేటి నుం­చి పా­ర్ల­మెం­ట్‌ సమా­వే­శా­లు ప్రా­రం­భ­మ­వు­తు­న్న వేళ.. కేం­ద్ర ప్ర­భు­త్వం ఆధ్వ­ర్యం­లో జరి­గిన అఖిల పక్ష సమా­వే­శం­లో ఆయన పా­ల్గొ­న్నా­రు. రూ.100 కో­ట్ల దాణా కుం­భ­కో­ణం­పై­నే గతం­లో పా­ర్ల­మెం­ట్‌ స్తం­భిం­చి­పో­యిం­ద­ని, అలాం­టి­ది రూ.3 వేల కో­ట్ల మద్యం కుం­భ­కో­ణం­పై చర్చిం­చా­ల్సిన అవ­స­రం ఎం­తై­నా ఉం­ద­న్నా­రు. మొ­త్తం ఆరు అం­శా­ల­పై పా­ర్ల­మెం­ట్‌­లో చర్చిం­చా­ల­ని అఖి­ల­ప­క్ష సమా­వే­శం­లో కో­రి­న­ట్లు ఆయన చె­ప్పా­రు. వై­సీ­పీ ప్ర­భు­త్వం­లో మద్యం వ్యా­పా­రం­లో ఢి­ల్లీ­ని మిం­చిన కుం­భ­కో­ణం జరి­గిం­ద­ని శ్రీ­కృ­ష్ణ­దే­వ­రా­య­లు ఆరో­పిం­చా­రు. ఏపీ కుం­భ­కో­ణం­తో పో­ల్చి­తే ఢి­ల్లీ స్కాం నీ­టి­బొ­ట్టం­తే అని వ్యా­ఖ్యా­నిం­చా­రు.

లిక్కర్ స్కామ్ మాస్టర్‌మైండ్‌ జగనే

మాజీ సీఎం జగ­న్‌ లి­క్క­ర్‌ మా­ఫి­యా కోటి కు­టుం­బా­ల­ను నా­శ­నం చే­సిం­ద­ని కాం­గ్రె­స్‌ పా­ర్టీ ఏపీ వ్య­వ­హా­రాల ఇన్‌­ఛా­ర్జి మా­ణి­కం ఠా­గూ­ర్‌ ఆరో­పిం­చా­రు. ఏపీ­లో మద్యం స్కా­మ్‌­పై మా­ణి­కం ఠా­గూ­ర్‌ ‘ఎక్స్‌’లో పో­స్టు పె­ట్టా­రు. ‘నా­సి­ర­కం మద్యం­తో రూ.3,200 కో­ట్లు కొ­ల్ల­గొ­ట్టా­రు. లి­క్క­ర్‌ స్కా­మ్‌­లో మి­థు­న్‌­రె­డ్డి కే­వ­లం పావు మా­త్ర­మే. అసలు మా­స్ట­ర్‌­మైం­డ్‌ జగ­న్‌, భా­ర­తి. లి­క్క­ర్‌ స్కా­మ్‌ సొ­మ్ము­ను ఎన్ని­క­ల్లో ఖర్చు చేసి ఓట్లు కొ­న్నా­రు’’ అని పే­ర్కొ­న్నా­రు. మరో­వై­పు.. మద్యం కుం­భ­కో­ణం వి­ష­యం­లో చట్టం తన పని తాను చే­సు­కుం­టూ వె­ళ్తుం­ద­ని జన­సేన ఎంపీ బా­ల­శౌ­రి అన్నా­రు. పా­ర్ల­మెం­టు సమా­వే­శాల వేళ.. కేం­ద్రం ని­ర్వ­హిం­చిన అఖిల పక్ష సమా­వే­శం­లో ఆయన పా­ల్గొ­న్నా­రు. వి­భ­జన సమ­స్య­లు, జల జీ­వ­న్ మి­ష­న్, బన­క­చ­ర్ల ప్రా­జె­క్టు గు­రిం­చి పా­ర్ల­మెం­టు­లో చర్చిం­చా­ల­ని జన­సేన తర­ఫున ప్ర­స్తా­విం­చి­న­ట్లు ఆయన తె­లి­పా­రు.

Tags

Next Story