Atchannaidu : మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్న పోలీసులను విడిచిపెట్టం : అచ్చెన్నాయుడు
By - TV5 Digital Team |19 April 2022 7:15 AM GMT
Atchannaidu : తమను వేధింపులకు గురి చేస్తున్న పోలీసులు విడిచిపెట్టేది లేదన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.
Atchannaidu : తమను వేధింపులకు గురి చేస్తున్న పోలీసులు విడిచిపెట్టేది లేదన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసి స్టేషన్ల వారీగా పోలీసులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. శ్రీకాకుళంలో సర్దార్ గౌతు లచ్చన్న 16వ వర్ధంతి సందర్భంగా గౌతు శిరీషతో కలిసి ఆయన నివాళులర్పించారు. వైసీపీ ప్రభుత్వం బీసీల గొంతు నొక్కుతుందని విమర్శించారు. జగన్.. బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి నోటికి ప్లాస్టర్ వేశారని ఎద్దేవా చేశారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి టీడీపీయే కారణమన్నారు అచ్చెన్నాయుడు. బీసీల అభ్యున్నతికి సర్దార్ గౌతు లచ్చన్న చేసిన సేవలను టీడీపీ నేతలు కొనియాడారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com