Atchannaidu : కరోనా విజృంభన వేళ అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు : అచ్చెన్నాయడు

X
By - prasanna |18 May 2021 6:48 PM IST
Atchannaidu : ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వం నిర్ణయం పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Atchannaidu : ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వం నిర్ణయం పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ వింత మనిషి... వింత చేష్టలు అని విమర్శించారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఇక రెండేళ్ళలో ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ప్రశ్నించారు. బడ్జెట్ ఆమోదించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. మార్చిలో బడ్జెట్ సమావేశాలు పెట్టాల్సి ఉన్నా.. సమావేశాలు నిర్వహించలేదని అన్నారు. కేంద్రం అనేక రాష్ట్రాలు బడ్జెట్ ఆమోదించుకున్నట్లు చెప్పారు. ఇక సమావేశాలు పెట్టాలని టీడీపీ కూడా చెప్పిందని అచ్చెన్నాయుడు అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com