ఏపీ ఈసీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ
X
By - Nagesh Swarna |24 Nov 2020 12:47 PM IST
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులే లక్ష్యంగా వైసీపీ దాడులకు పాల్పడుతుందని.. కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు SECకి లేఖ రాశారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికలను ఎదుర్కొనలేకే.. టీడీపీ అభ్యర్థులపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరగాలని.. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలని లేఖ ద్వారా కోరారు. ఆన్లైన్లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు అచ్చెన్నాయుడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com