Avanthi Srinivasa Rao: దిగొచ్చిన అవంతి శ్రీనివాస్.. టీవీ5 ప్రతినిధికి క్షమాపణలు..

Avanthi Srinivasa Rao: దిగొచ్చిన అవంతి శ్రీనివాస్.. టీవీ5 ప్రతినిధికి క్షమాపణలు..
Avanthi Srinivasa Rao: రైతు భరోసా కేంద్రంలో రెచ్చిపోయిన ఎట్టకేలకు ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దిగొచ్చారు.

Avanthi Srinivasa Rao: రైతు భరోసా కేంద్రంలో రెచ్చిపోయిన ఎట్టకేలకు ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దిగొచ్చారు. అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో మా టీవీ-5 ప్రతినిధికి అవంతి క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభాలు దెబ్బ తీయాలని తన ఉద్దేశ్యం కాదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు.

ఈనెల 16న విశాఖలోని కొరడా రైతు భరోసా కార్యక్రమంలో అవంతి రెచ్చిపోయారు. భీమిలీ టీవీ-5 రిపోర్టర్‌ను దూషించారు. కవరేజ్‌కు వెళ్లిన రిపోర్టర్‌ను.. పంతులు నీ సంగతి చూస్తానంటూ బెదిరించారు. దీంతో అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాయి. టీడీపీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story