Kakinada : ఆయుష్మాన్ భారత్ ఉద్యోగుల నిరసన

X
By - Manikanta |29 April 2025 12:30 PM IST
కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ లో పనిచేస్తున్న సిహెచ్ఓలు ఆందోళన బాటపట్టారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించారు. డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఆయుష్మాన్ భారత్ లో సిహెచ్ఓలుగా ఆరు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమంగా 23 శాతం వేతన సవరణ చేయాలంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com