AP: ఏపీలో రైతుల సమస్యలపై భాజపా కిసాన్‌ మోర్చా ఆందోళన

AP: ఏపీలో రైతుల సమస్యలపై భాజపా కిసాన్‌ మోర్చా ఆందోళన

గుంటూరులో రైతుల సమస్యలను పరిష్కారించాలని ఆందోళనకు యత్నించిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం రైతు సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... భాజపా కిసాన్ మోర్చా ఆందోళనకు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఇవాళ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. పోలీసులు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు. ముందస్తుగా ఉమ్మడి గుంటూరు జిల్లా కిసాన్ మోర్చా నేతలకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఆందోళనకు ఉపక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చుట్టుగుంటలోని కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కమిషనర్ కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు. కమిషనర్ కార్యాలయం 4 గేట్ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఉద్యోగిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించారు .

Tags

Read MoreRead Less
Next Story