AP : ఎన్టీఆర్ కాలనీలో ఇళ్లు కట్టుకోండి.. మంత్రి పార్థసారథి ప్రకటన

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ఎన్టీఆర్ కాలనీ సెంటు స్థలాలను మంత్రి పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. ఎన్టీఆర్ కాలనీలో గతంలో 1602 స్థలాలకు గాను, 1406 మంది లబ్ధిదారులకు స్థలం కేటాయించగా.. ప్రస్తుతం 320 మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. బేస్మెంట్ వేసిన 873 ఇల్లు ఆగిపోయాయి... మిగతా లబ్ధిదారులను పిలిచి ఇల్లు నిర్మించుకోవాలని మంత్రి సూచించారు.
లేనిపక్షంలో ప్రభుత్వ నుంచి వచ్చే లబ్ది కోల్పోతారని తెలిపారు. ఎన్టీఆర్ కాలనీ ప్రధాన అర్హుదారులను త్వరలోనే ఎంపిక చేస్తామని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. గతంలో ఇళ్ల స్థలాల విషయంలో అవకతవకలు జరిగాయని.. మరోసారి విచారణ జరిపి లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని మంత్రి ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com