CBN: పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా: చంద్రబాబు

CBN: పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా: చంద్రబాబు
X
పెద్ద మనసు చాటుకున్న పెద్దాయన

ఏపీ సీఎం చం­ద్ర­బా­బు మరో కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. పా­వ­ర్టీ­కి ది­గు­వన ఉన్న కొ­న్ని కు­టుం­బా­ల­ను తాను దత్తత తీ­సు­కుం­టు­న్న­ట్టు ప్ర­క­టిం­చా­రు. జీరో పా­వ­ర్టీ P4 పథ­కం­పై సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు సమీ­క్షా సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. ఈ సమా­వే­శం­లో చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ.. పే­ద­రిక ని­ర్మూ­ల­న­కు పేద కు­టుం­బా­ల­ను దత్తత తీ­సు­కుం­టు­న్న ని­ర్ణ­యా­న్ని వె­ల్ల­డిం­చా­రు. అంతే కా­కుం­డా పే­ద­రిక ని­ర్మూ­ల­న­లో తన కు­టుంబ సభ్యు­లు కూడా భా­గ­స్వా­ము­లు అవు­తా­ర­ని పే­ర్కొ­న్నా­రు. P4 కా­ర్య­క్ర­మం ప్ర­జా ఉద్య­మం­లా సా­గు­తోం­ద­ని అన్నా­రు. పేద కు­టుం­బాల సా­ధి­కా­ర­తే కూ­ట­మి ప్ర­భు­త్వ లక్ష్యం అని తె­లి­పా­రు. తె­లు­గు వారు ఎక్క­డు­న్నా ఈ కా­ర్య­క్ర­మం­లో భాగం కా­వా­ల­ని సూ­చిం­చా­రు.

ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా.. 57,503 మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని తెలిపారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని.. విశాఖపట్నం జిల్లా చివరలో ఉందన్నారు. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్ రూపంలో సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నామన్నారు. సోషల్ మీడియా, ఇతర ప్లాట్ ఫామ్‌ల ద్వారా పీ4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తలపెట్టిన డిజిటల్ ప్రమోషన్ కార్యకలాపాల గురించి సీఎంకు అధికారులు వివరించారు.

Tags

Next Story