CBN: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్

CBN: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్
X
కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన... శంకుస్థాపన చేసినచంద్రబాబు, పవన్ కల్యాణ్... గ్రీన్ అమ్మోనియాతో పెను మార్పులు: చంద్రబాబు

భవి­ష్య­త్‌ ఇంధన అవ­స­రా­ల­కు మా­ర్గ­ద­ర్శ­కం­గా ని­లి­చే గ్రీ­న్‌ హై­డ్రో­జ­న్‌, గ్రీ­న్‌ అమ్మో­ని­యా రం­గా­ల్లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­ను అగ్ర­గా­మి­గా ని­లి­పే ది­శ­గా రా­ష్ట్ర ప్ర­భు­త్వం కీలక అడు­గు వే­సిం­ది. పరి­శ్ర­మ­లు, పర్యా­వ­రణ పరి­ర­క్షణ, ఉపా­ధి సృ­ష్టి – ఈ మూ­డిం­టి­నీ సమ­తు­ల్యం­గా ముం­దు­కు తీ­సు­కె­ళ్లే లక్ష్యం­తో కా­కి­నాడ కేం­ద్రం­గా భారీ ప్రా­జె­క్టు­కు శ్రీ­కా­రం చు­ట్టిం­ది. రూ.18 వేల కో­ట్ల పె­ట్టు­బ­డి­తో ఏర్పా­టు కా­ను­న్న ఏఎం గ్రీ­న్‌ అమ్మో­ని­యా ప్రా­జె­క్టు­కు చం­ద్ర­బా­బు, పవన్ కళ్యా­ణ్ శం­కు­స్థా­పన చే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా ని­ర్వ­హిం­చిన సభలో రా­ష్ట్ర భవి­ష్య­త్‌­పై స్ప­ష్ట­మైన దృ­ష్టి­ని సీఎం వి­వ­రిం­చా­రు.

కా­కి­నా­డ­లో ఏర్పా­ట­య్యే ఈ పరి­శ్రమ ప్ర­పం­చం­లో­నే అతి­పె­ద్ద గ్రీ­న్‌ అమ్మో­ని­యా యూ­ని­ట్‌­గా ని­ల­వ­నుం­ద­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. 2027 జూ­న్‌ నా­టి­కి తొలి దశ ఉత్ప­త్తి ప్రా­రం­భ­మ­వు­తుం­ద­ని, తదు­ప­రి దశ­ల్లో సా­మ­ర్థ్యం మరింత పెం­చు­తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. గ్రీ­న్‌ అమ్మో­ని­యా అనే­ది కే­వ­లం ఒక పరి­శ్రమ మా­త్ర­మే కా­ద­ని, ఇది రా­ష్ట్ర ఆర్థిక వ్య­వ­స్థ­ను కొ­త్త ది­శ­గా మలి­చే ‘గే­మ్‌ ఛేం­జ­ర్‌’ అని ఆయన పే­ర్కొ­న్నా­రు. బొ­గ్గు ఆధా­రిత ఇం­ధ­నాల వల్ల పర్యా­వ­ర­ణం తీ­వ్రం­గా దె­బ్బ­తిం­టోం­ద­ని, కా­లు­ష్యం కా­ర­ణం­గా సము­ద్ర జీ­వ­వ్య­వ­స్థ­లో­నూ పె­ద్ద మా­ర్పు­లు వస్తు­న్నా­య­ని ఆం­దో­ళన వ్య­క్తం చే­శా­రు. దే­శం­లో గ్రీ­న్‌ ఎన­ర్జీ ఉత్ప­త్తి­ని వి­స్తృ­తం­గా పెం­చా­ల­ని ప్ర­ధా­ని నరేం­ద్ర మోదీ కో­రు­తు­న్నా­ర­ని గు­ర్తు­చే­శా­రు. అయి­తే 2014లోనే తమ ప్ర­భు­త్వం గ్రీ­న్‌ ఎన­ర్జీ వైపు అడు­గు­లు వే­సిం­ద­ని, అప్పు­డే సో­లా­ర్‌, విం­డ్‌ వంటి ప్ర­త్యా­మ్నాయ ఇం­ధ­నా­ల­పై ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టా­మ­ని తె­లి­పా­రు.

ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, భవిష్యత్‌లో 20 వరకు పోర్టులు ఏర్పాటు కానున్నాయని సీఎం వివరించారు. ఈ పోర్టులు పరిశ్రమలకు రవాణా సౌలభ్యాన్ని కల్పించడమే కాకుండా, ఎగుమతుల అవకాశాలను కూడా విస్తృతం చేస్తాయని చెప్పారు. గ్రీన్‌ అమ్మోనియాను ప్రపంచంలోని ఏ దేశానికైనా ఎగుమతి చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉందని, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతికతను వినియోగించుకుంటూనే మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా స్వగ్రామాన్ని, మూలాలను మర్చిపోకూడదని హితవు పలికారు. ఆలోచనలు మాత్రమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టే వ్యక్తులు చాలా అరుదని, అటువంటి వారిలో చలమలశెట్టి అనిల్‌ ఒకరని ప్రశంసించారు. చరిత్రను తిరగరాయడంలో తెలుగువాడు ముందుండటం గర్వకారణమని, కాకినాడ పేరు భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుందని అన్నారు. గతంలో ఎన్టీఆర్‌ చొరవతో కాకినాడకు నాగార్జున ఫెర్టిలైజర్స్‌ పరిశ్రమ వచ్చిందని గుర్తు చేస్తూ, అప్పటి నుంచి ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎదుగుతూ వస్తోందని చెప్పారు. ఇలాంటి భారీ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు సమృద్ధిగా ఉన్నాయన్నారు.

Tags

Next Story