CBN: తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్

CBN: తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్
X
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఆదేశాలు

శ్రీ­కా­కు­ళం జి­ల్లా­లో­ని కా­శీ­బు­గ్గ వెం­క­టే­శ్వర ఆల­యం­లో జరి­గిన తొ­క్కి­స­లా­ట­పై ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు సీ­రి­య­స్ అయ్యా­రు. ఈ దు­ర్ఘ­ట­న­పై పూ­ర్తి వి­చా­ర­ణ­కు ఆదే­శిం­చా­రు. ఇలాం­టి దు­ర్ఘ­ట­న­లో జర­గ­డం చాలా దు­ర­దృ­ష్ట­క­ర­మ­ని అన్నా­రు.

శ్రీ­స­త్య­సా­యి జి­ల్లా తలు­పుల మం­డ­లం పె­ద్ద­న్న­వా­రి­ప­ల్లి గ్రా­మం­లో శని­వా­రం పర్య­టిం­చిన ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు ఈ మే­ర­కు ఆదే­శా­లు జారీ చే­శా­రు. సీఎం మా­ట్లా­డు­తూ..."ని­న్నా.. మొ­న్న పె­ద్దఎ­త్తున తు­పా­ను వచ్చి­నా ప్రా­ణా­లు కా­పా­డా­ల­ని ప్ర­య­త్నం చే­సాం. ఇద్ద­రు చని­పో­యా­రు. ఈరో­జు ప్రై­వే­టు వ్య­క్తి ఏర్పా­టు చే­సిన కా­శీ­బు­గ్గ వెం­క­టే­శ్వర దే­వా­ల­యం­లో కా­ర్తీక మాసం సం­ద­ర్భం­గా తొ­క్కి­స­లాట జరి­గి 9 మంది చని­పో­యా­రు. 5 మంది గా­య­ప­డ్డా­రు. చాలా బా­ధా­క­రం. ప్రా­ణా­లు చాలా ము­ఖ్యం. మనం కూడా బా­ధ్య­త­గా ఉం­డా­లి. అమా­య­కు­లు చని­పో­యా­రు. చాలా బా­ధ­ప­డు­తు­న్నాం. ఇం­దు­కు కా­ర­ణ­మైన వా­రి­ని అదు­పు­లో­కి తీ­సు­కు­ని వి­చా­రణ చేసి చర్య­లు తీ­సు­కుం­టాం. చని­పో­యిన కు­టుం­బా­ల­కు నా ప్ర­గాఢ సా­ను­భూ­తి తె­లి­య­జే­స్తు­న్నా­ను. వారి ఆత్మ శాం­తి కల­గా­లి. మన­మం­ద­రం ని­మి­త్త­మా­త్రు­లం. " అని అన్నా­రు. దే­వు­ని సన్ని­ధి­లో చని­పో­యిన వా­రి­కి ని­వా­ళు­లు అర్పిం­చా­రు సీఎం చం­ద్ర­బా­బు అనం­త­రం 2 ని­మి­షా­లు మౌనం పా­టిం­చి శ్రద్ధాంజలి ఘటించారు.

నారా లోకేశ్ తీవ్ర విచారం

కా­శీ­బు­గ్గ ఆల­యం­లో జరి­గిన తొ­క్కి­స­లా­ట­లో భక్తు­లు మర­ణిం­చ­డం­పై మం­త్రి నారా లో­కే­ష్ తీ­వ్ర ది­గ్భ్రాం­తి వ్య­క్తం చే­శా­రు. మర­ణిం­చి­న­వా­రి కు­టుం­బా­ల­కు తన ప్ర­గాఢ సా­ను­భూ­తి తె­లి­య­జే­శా­రు. ఏకా­ద­శి రో­జున ఇం­త­టి తీ­వ్ర వి­షాద ఘటన జర­గ­డం దు­ర­దృ­ష్ట­క­ర­మ­న్నా­రు. కా­సే­ప­ట్లో ఆయన కా­శీ­బు­గ్గ­కు వె­ళ్లి.. అక్క­డి పరి­స్థి­తి­ని స్వ­యం­గా సమీ­క్షిం­చ­ను­న్నా­రు. కాగా.. మధ్య­ప్ర­దే­శ్ లోని భో­పా­ల్ పర్య­ట­న­లో ఉన్న జి­ల్లా కేం­ద్ర­మం­త్రి రా­మ్మో­హ­న్ నా­యు­డు వి­ష­యం తె­లి­సిన వెం­ట­నే అక్క­డి నుం­చి బయ­ల్దే­రా­రు. కాగా.. తొ­క్కి­స­లా­ట­లో గా­య­ప­డి­న­వా­రి­కి మె­రు­గైన చి­కి­త్స అం­దిం­చా­ల­ని హోం­మం­త్రి అనిత అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. ఆలయం మొ­ద­టి అం­త­స్తు­లో ఉం­డ­టం, 20 మె­ట్లు ఎక్కి పైకి వె­ళ్లే క్ర­మం­లో రె­యి­లిం­గ్ ఊడి­ప­డ­టం­తో ప్ర­మా­దం జరి­గి­న­ట్లు­గా మం­త్రి తె­లి­పా­రు. మృ­తు­ల్లో మహి­ళా భక్తు­లు ఎక్కు­వ­గా ఉం­డ­టం బా­ధా­క­ర­మ­న్నా­రు.

Tags

Next Story