CBN: మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

CBN: మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
X
మరోసారి విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. దుబాయ్, అబుదాబీ, యూఏఈలో పర్యటన... విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకే టూర్

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు మరో­సా­రి వి­దే­శీ పర్య­ట­న­కు వె­ళ్లా­రు. దు­బా­య్‌, అబు­దా­బి, యూ­ఏ­ఈ­లో పర్య­టి­స్తు­న్నా­రు. నవం­బ­ర్ లో వి­శా­ఖ­ప­ట్నం­లో జరి­గే భా­గ­స్వా­మ్య సద­స్సు­కు వి­దే­శీ పె­ట్టు­బ­డు­దా­రు­ల­ను ఆహ్వా­నిం­చేం­దు­కు ఆయా దే­శా­ల్లో పర్య­టిం­చ­బో­తు­న్నా­రు. ఈ టూర్ లో భా­గం­గా రి­య­ల్ ఎస్టే­ట్స్, భవన ని­ర్మా­ణం, లా­జి­స్టి­క్స్‌­తో పాటు రవా­ణా, ఫై­నా­న్స్ సర్వీ­సె­స్, ఇన్నో­వే­ష­న్స్ రం­గా­ల్లో పె­ట్టు­బ­డు­ల­కు ఆహ్వా­నం పల­క­ను­న్నా­రు. రి­య­ల్ ఎస్టే­ట్, భవన ని­ర్మా­ణం, లా­జి­స్టి­క్స్, రవా­ణా, ఫై­నా­న్స్ సర్వీ­సె­స్, ఇన్నో­వే­ష­న్స్ వంటి రం­గా­ల­లో పె­ట్టు­బ­డు­లు పె­ట్టా­ల­ని చం­ద్ర­బా­బు ఆహ్వా­నిం­చ­ను­న్నా­రు. వి­విధ దే­శాల నుం­డి పె­ట్టు­బ­డి­దా­రు­ల­ను ఆక­ర్షిం­చి, రా­ష్ట్ర ఆర్థి­కా­భి­వృ­ద్ధి­కి బా­ట­లు వే­యా­ల­ని ఆయన ప్ర­య­త్ని­స్తు­న్నా­రు. ఈ పర్య­ట­న­లో మం­త్రు­లు టీజీ భరత్, బీసీ జనా­ర్ద­న్ రె­డ్డి­తో పాటు పలు­వు­రు ఉన్న­తా­ధి­కా­రు­లు సీఎం వెంట వె­ళ్తు­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ లో పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­డా­ని­కి గల అవ­కా­శా­ల­ను వి­వ­రి­స్తా­రు.వి­శా­ఖ­ప­ట్నం­లో నవం­బ­ర్‌­లో రెం­డు రో­జుల పాటు భా­గ­స్వా­మ్య సద­స్సు జర­గ­నుం­ది. ఈ సద­స్సు­కు వి­విధ దే­శాల పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల­ను, ప్ర­తి­ని­ధు­ల­ను ప్ర­భు­త్వం ఆహ్వా­నిం­చిం­ది. మరో­వై­పు, ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు పె­ట్టు­బ­డు­లు ఆక­ర్షిం­చే లక్ష్యం­తో సీఎం చం­ద్ర­బా­బు నవం­బ­ర్ 2 నుం­చి 5 వరకు లం­డ­న్ పర్య­ట­న­కు వె­ళ్తు­న్నా­రు.

అక్కడ పలు­వు­రు పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల­తో ఆయన సమా­వే­శ­మ­వు­తా­రు. ఆయన నవం­బ­ర్ 2వ తేదీ నుం­చి 5వ తేదీ వరకు బ్రి­ట­న్ రా­జ­ధా­ని లం­డ­న్‌­లో పర్య­టి­స్తా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­డ­మే లక్ష్యం­గా లం­డ­న్ పర్య­టన కొ­న­సా­గ­నుం­ది. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్ర అభి­వృ­ద్ధే లక్ష్యం­గా ఎన్డీ­యే కూ­ట­మి ప్ర­భు­త్వం వ్యూ­హా­త్మ­కం­గా ముం­దు­కు వె­ళ్తుం­ది. రా­జ­ధా­ని అమ­రా­వ­తి­తో పాటు రా­ష్ట్రం­లో­ని ఆయా ప్రాం­తాల అభి­వృ­ద్ధి కోసం చం­ద్ర­బా­బు ప్ర­భు­త్వం అడు­గు­లు వే­స్తోం­ది. అం­దు­లో భా­గం­గా ము­ఖ్య­మం­త్రి వి­దే­శా­ల్లో పర్య­టి­స్తూ.. రా­ష్ట్రా­భి­వృ­ద్ధి కోసం వ్యూ­హా­లు రచి­స్తు­న్నా­రు. ఇప్ప­టి­కే సిం­గ­పూ­ర్, దా­వో­స్‌­లో­నూ ఆయన పర్య­టిం­చిన సం­గ­తి తె­లి­సిం­దే. అలా­గే, మం­త్రి లో­కే­ష్ కూడా ఏపీ­లో పె­ట్టు­బ­డుల కోసం ఆస్ట్రే­లి­యా­లో పర్య­టి­స్తు­న్నా­రు. మరో­వై­పు మం­త్రి నారా లో­కే­ష్ ఆస్ట్రే­లి­యా­లో­ని సి­డ్నీ­లో జరి­గిన సీఐఐ పా­ర్ట్‌­న­ర్‌­షి­ప్‌ సమ్మి­ట్‌ రో­డ్‌­షో­లో పా­ల్గొ­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో అను­భ­వం కలి­గిన సమ­ర్థ నా­య­క­త్వం ఉం­ద­ని తె­లి­పా­రు. వి­శా­ఖ­ప­ట్నం­లో జర­గ­ను­న్న సీఐఐ భా­గ­స్వా­మ్య సద­స్సు­కు అం­ద­రూ రా­వా­ల­ని ఆయన వి­జ్ఞ­ప్తి చే­శా­రు. గత 16 నె­ల­ల్లో రూ.10 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­లు వచ్చా­య­ని ఆయన వె­ల్ల­డిం­చా­రు. మొ­త్తం మీద అటు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, ఇటు ఐటీ మం­త్రి నారా లో­కే­ష్ వి­దే­శీ పర్య­ట­న­ల­తో ఏపీ­కి పె­ట్టు­బ­డు­లు తీ­సు­కొ­చ్చే పని­లో ఉన్నా­రు.

Tags

Next Story