CBN: ఏడాది పాలనపై నేడు ప్రభుత్వం సమావేశం

CBN: ఏడాది పాలనపై నేడు ప్రభుత్వం సమావేశం
X
నేడు 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం.. పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు

ఏపీ కూ­ట­మి ప్ర­భు­త్వం తమ ఏడా­ది పా­ల­న­ను పు­ర­స్క­రిం­చు­కు­ని "సు­ప­రి­పా­లన.. తొలి అడు­గు" పే­రు­తో నేడు అమ­రా­వ­తి­లో సమా­వే­శం ని­ర్వ­హిం­చ­నుం­ది. వె­ల­గ­పూ­డి సచి­వా­ల­యం సమీ­పం­లో జర­గ­ను­న్న ఈ సభకు ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు, ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కల్యా­ణ్ నే­తృ­త్వం వహిం­చ­ను­న్నా­రు. ఈ కా­ర్య­క్ర­మం­లో మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­లు, ఎం­పీ­లు, ఎమ్మె­ల్సీ­లు, ప్ర­భు­త్వ ఉన్న­తా­ధి­కా­రు­లు హా­జ­ర­వు­తా­రు. ఈ సభ జూన్ 12న జర­గా­ల్సి ఉం­డ­గా, అహ్మ­దా­బా­ద్ వి­మా­నం ప్ర­మా­దం కా­ర­ణం­గా బా­యి­దా పడిం­ది. గత ఏడా­ది కా­లం­లో కూ­ట­మి ప్ర­భు­త్వం చే­ప­ట్టిన అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­లు, సం­క్షేమ పథ­కాల పు­రో­గ­తి­ని సమీ­క్షిం­చ­డం­తో పాటు రెం­డో ఏడా­ది పాలన లక్ష్యా­ల­పై ఈ సమా­వే­శం­లో చర్చ జర­గ­నుం­ది. సీఎం చం­ద్ర­బా­బు, డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్ గత ఏడా­ది ప్ర­భు­త్వ సా­ధ­న­ల­ను వి­వ­రి­స్తూ.. రా­ష్ట్ర అభి­వృ­ద్ధి కోసం రెం­డో ఏడా­ది రో­డ్‌­మ్యా­ప్‌­ను ప్ర­క­టిం­చ­ను­న్నా­రు. ము­ఖ్యం­గా అమ­రా­వ­తి రా­జ­ధా­ని పు­న­ర్ని­ర్మా­ణం, సిం­గ­పూ­ర్ ప్ర­భు­త్వం­తో భా­గ­స్వా­మ్యం­తో స్టా­ర్ట­ప్ ఏరి­యా అభి­వృ­ద్ధి, పరి­శ్ర­మల ఏర్పా­టు, ఉపా­ధి కల్పన, సినీ పరి­శ్రమ అభి­వృ­ద్ధి, గ్రా­మీణ ఉపా­ధి హామీ పథకం ద్వా­రా గ్రామ సభల బలో­పే­తం వంటి అం­శా­ల­పై దృ­ష్టి సా­రిం­చ­ను­న్నా­రు.

ఏడాది పాలనపై చర్చ

గత ఏడా­ది అమలు చే­సిన అన్నా క్యాం­టీ­న్లు, దీపం-2 పథకం కింద ఉచిత సి­లిం­డ­ర్లు, తల్లి­కి వం­ద­నం పథకం కింద రూ.15,000 ఆర్థిక సాయం, బీ­సీ­ల­కు ప్ర­త్యేక ప్ర­ణా­ళి­క­లు, వి­దే­శీ వి­ద్య­కు రూ.15 లక్షల సాయం వంటి కా­ర్య­క్ర­మాల పు­రో­గ­తి­ని సమీ­క్షి­స్తా­రు. రెం­డో ఏడా­ది లక్ష్యా­ల­లో రూ.1 లక్ష కో­ట్ల వి­లు­వైన ప్రా­జె­క్టు­ల­కు శం­కు­స్థా­పన, పి­ఠా­పు­రం ని­యో­జ­క­వ­ర్గం­లో రూ.308 కో­ట్ల­తో అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­లు, పం­చా­య­తీ రాజ్ బలో­పే­తం, కా­కి­నాడ పో­ర్టు అభి­వృ­ద్ధి, రే­ష­న్ మా­ఫి­యా ని­యం­త్రణ వంటి అం­శా­లు ఉం­డ­వ­చ్చ­ని సమా­చా­రం.

Tags

Next Story