CBN: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఢిల్లీకి చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరుకాబోతున్నారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీతోనూ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీకి నారా లోకేశ్,కేంద్రమంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో లోకేశ్ సమావేశం అవుతారని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులను కలుసుకొని రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతుల విషయాలపై ప్రస్తావించారు. ఫలితంగా, కొత్త ప్రాజెక్టుల రాకతో పాటు అనుమతులు వేగంగా మంజూరు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రానికి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్కు లోకేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపనున్నారు. నారా లోకేష్ రేపు ఢిల్లీలో రోడ్డురవాణా, రహదార్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని , ఓడరేవులు, జలరవాణాశాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్ ను, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కేంద్రమంత్రులను వరుసగా కలవనున్నారు. రాష్ట్రానికి అత్యవసరంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం నుండి సహకారం పొందే దిశగా వివిధ ప్రతిపాదనలను నారా లోకేష్ సమర్పించనున్నారు. ఈ భేటీల ద్వారా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com