CBN: "మద్యం కేసులో వైసీపీ నేతలు అడ్డంగా దొరికారు"

CBN: మద్యం కేసులో వైసీపీ నేతలు అడ్డంగా దొరికారు
X

వై­సీ­పీ హయాం­లో జరి­గిన మద్యం కుం­భ­కో­ణం­లో సి­ట్‌ వి­చా­రణ తుది దశకు చే­రిం­ద­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. టీ­డీ­పీ పా­ర్ల­మెం­ట­రీ పా­ర్టీ సమా­వే­శం­లో ఆయన కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. ‘‘అన్ని ఆధా­రా­ల­తో గత పా­ల­కు­లు అడ్డం­గా దొ­రి­కా­రు. ప్ర­జా­ధ­నా­న్ని వి­చ్చ­ల­వి­డి­గా దో­చు­కు­న్నా­రు. దో­పి­డీ ఏ స్థా­యి­లో జరి­గిం­దో ప్ర­జ­ల­కు చె­ప్పా­ల్సిన బా­ధ్యత మనపై ఉంది. కేసు వి­చా­రణ పా­ర­ద­ర్శ­కం­గా జర­గా­ల­నే ఇప్ప­టి­వ­ర­కు మా­ట్లా­డ­లే­దు. జగ­న్‌.. తాను చే­సిన తప్పు­ల్ని కూడా మన­మీ­ద­కు నె­ట్టే­సే రకం. కేం­ద్రం­లో తె­దే­పా కీ­ల­క­పా­త్ర పో­షి­స్తు­న్నం­దున ఎం­పీల తీరు ఇంకా మె­రు­గు­ప­డా­లి. రా­ష్ట్ర అం­శా­లే ప్ర­ధాన అజెం­డా­గా ఎం­పీ­లు ఇంకా బాగా మా­ట్లా­డా­లి. రా­ష్ట్ర ప్ర­గ­తి­ని దే­శ­స్థా­యి­లో వి­వ­రిం­చా­ల్సిన బా­ధ్యత ఎం­పీ­ల­దే’’ అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

మామిడి రైతులకు చంద్రబాబు శుభవార్త

సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు మాట ని­ల­బె­ట్టు­కు­న్నా­రు. మా­మి­డి రై­తుల సమ­స్య­ను పరి­ష్క­రి­స్తా­మ­ని కు­ప్పం పర్య­ట­న­లో హామీ ఇచ్చా­రు. ఈ మే­ర­కు ఆయన అడు­గు­లు వే­శా­రు. మా­మి­డి రై­తుల పరి­ష్కా­రా­ని­కి రూ.260 కో­ట్ల ని­ధు­ల­ను వి­డు­దల చే­శా­రు. రూ.4 సబ్సి­డీ­తో 6.5 లక్షల టన్నుల తో­తా­పు­రి మా­మి­డి కా­య­లు కొ­ను­గో­లు చే­సేం­దు­కు కే­టా­యిం­చా­ల­ని ఆదే­శిం­చా­రు. దీం­తో మా­ర్కె­ట్ సమ­స్య­ల­తో బా­ధ­ప­డు­తు­న్న చి­త్తూ­రు జి­ల్లా మా­మి­డి రై­తు­ల­కు లబ్ధి­చే­కూ­ర­నుం­ది. సబ్సి­డీ మొ­త్తా­న్ని రై­తుల బ్యాం­క్ ఖా­తా­ల్లో నే­రు­గా జమ చే­స్తు­న్న­ట్లు అధి­కా­రు­లు సూ­చి­స్తు­న్నా­రు. రై­తు­లు తమ అకౌం­ట్ల­ను పరి­శీ­లిం­చు­కో­వా­ల­ని చె­ప్పా­రు. అయి­తే రూ. 260 కో­ట్లు MIS వి­ధా­నం­పై సహా­యం అం­దిం­చా­ల­ని కేం­ద్ర సహ­కా­రా­న్ని ప్ర­భు­త్వం కో­రిం­ద­ని వ్య­వ­శాయ శాఖ తె­లి­పిం­ది.

Tags

Next Story