CBN: ఆగస్టు 15 నుంచి బస్సుల్లో జీరో టికెట్‌: సీఎం చంద్రబాబు

CBN: ఆగస్టు 15 నుంచి బస్సుల్లో జీరో టికెట్‌: సీఎం చంద్రబాబు
X
100 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు

ఆగ­స్టు 15 నుం­చి మహి­ళ­ల­కు బస్సు­ల్లో జీరో ఫే­ర్‌ టి­కె­ట్‌ ఇవ్వా­ల­ని సం­బం­ధిత అధి­కా­రు­ల­ను ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­రు. మహి­ళ­ల­కు ఉచిత బస్సు ప్ర­యా­ణం పథ­కం­పై సో­మ­వా­రం సీఎం సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. మహి­ళ­ల­కు ఉచిత బస్సు పథ­కం­తో ఏ రా­ష్ట్రా­ల­కు ఎంత భారం అనే అం­శం­పై అధి­కా­రు­ల­తో చం­ద్ర­బా­బు చర్చిం­చా­రు. ఉచిత ప్ర­యా­ణం­తో లబ్ధి, 100 శాతం రా­యి­తీ వి­వ­రా­ల­ను మహి­ళ­ల­కు ఇచ్చే జీరో ఫే­ర్‌ టి­కె­ట్‌­లో పొం­దు­ప­ర్చా­ల­న్నా­రు. ‘‘ఈ పథకం ఆర్టీ­సీ­కి భారం కా­కుం­డా ఆదాయ మా­ర్గా­లు అన్వే­షిం­చా­లి. ని­ర్వ­హణ వ్య­యం తగ్గిం­పు­తో సం­స్థ­ను లా­భాల బాట పట్టిం­చా­లి. లా­భాల ఆర్జన వి­ధా­నా­లు, మా­ర్గా­ల­పై కా­ర్యా­చ­రణ రూ­పొం­దిం­చా­లి. రా­ష్ట్రం­లో ఇకపై ఏసీ ఎల­క్ట్రా­ని­క్‌ బస్సు­లే కొ­ను­గో­లు చే­యా­లి. ఆర్టీ­సీ బస్సు­ల­ను ఎల­క్ట్రి­క్‌­గా మా­రి­స్తే ని­ర్వ­హణ వ్య­యం తగ్గు­తుం­ది. ఇం­దు­కు అవ­స­ర­మ­య్యే వి­ద్యు­త్‌­ను సొం­తం­గా ఉత్ప­త్తి చే­సు­కో­వా­లి. ఆర్టీ­సీ డి­పో­ల్లో ఛా­ర్జిం­గ్‌ స్టే­ష­న్ల ఏర్పా­టు­పై అధ్య­య­నం చే­యా­లి’’అని ము­ఖ్య­మం­త్రి ది­శా­ని­ర్దే­శం చే­శా­రు.

ఎవరినైనా అరెస్టు చేస్తారు: హోంమంత్రి

ఆధా­రా­లు ఉం­టే­నే ఎవ­రి­నై­నా అరె­స్టు చే­స్తా­ర­ని హోం­మం­త్రి అనిత అన్నా­రు. ఏమై­నా ఉంటే కో­ర్టు­లో తే­ల్చు­కో­వా­ల­ని, కో­ర్టు రి­మాం­డ్‌ వి­ధిం­చిం­దం­టే మనం గౌ­ర­విం­చా­ల­ని పే­ర్కొ­న్నా­రు. న్యా­య­స్థా­నా­ని­కి సరైన ఆధా­రా­లు ఇవ్వ­కుం­టే రి­మాం­డ్‌­కు ఇవ్వ­రు కదా అన్నా­రు. ప్రొ­సీ­జ­ర్‌ యథా­వి­ధి­గా సా­గు­తుం­ద­ని పే­ర్కొ­న్నా­రు. వై­సీ­పీ ఎంపీ మి­థు­న్‌­రె­డ్డి అరె­స్టు, రి­మాం­డ్ గు­రిం­చి హోం­మం­త్రి అనిత ఈ వ్యా­ఖ్య­లు చే­శా­రు. ప్ర­స్తు­తం మూడు సై­బ­ర్‌ క్రై­మ్‌ పో­లీ­సు­స్టే­ష­న్లు పని­చే­స్తు­న్నా­య­ని చె­ప్పా­రు. జి­ల్లా­కు ఒక సై­బ­ర్‌ క్రై­మ్‌ పీ­ఎ­స్‌ ఏర్పా­టు­కు సీఎం చం­ద్ర­బా­బు ఆదే­శా­లి­చ్చా­ర­ని తె­లి­పా­రు. లక్ష సీసీ కె­మె­రా­లు ఏర్పా­టు­చే­యా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్న­ట్లు చె­ప్పా­రు. ప్ర­తి ని­యో­జ­క­వ­ర్గం, గ్రా­మం­లో వీటి ఏర్పా­టు­కు చర్య­లు తీ­సు­కుం­టు­న్న­ట్లు వి­వ­రిం­చా­రు. ప్ర­తి పో­లీ­సు­స్టే­ష­న్‌­కు రెం­డు డ్రో­న్లు ఇచ్చే­లా చర్య­లు తీ­సు­కుం­టా­మ­న్నా­రు. ప్ర­తి మూడు నె­ల­ల­కో­సా­రి జాబ్ మేళా ని­ర్వ­హి­స్తా­మ­ని హోం­మం­త్రి వం­గ­ల­పూ­డి అనిత తె­లి­పా­రు. ఎన్ని­క­ల్లో ఇచ్చిన హామీ మే­ర­కు యు­వ­త­కు ఉద్యో­గం, ఉపా­ధి కల్పిం­చేం­దు­కు ప్ర­భు­త్వం కట్టు­బ­డి ఉం­ద­న్నా­రు. ప్ర­తీ ని­యో­జ­క­వ­ర్గం­లో జాబ్ మే­ళా­లు తప్ప­కుం­డా ఏర్పా­టు చే­స్తా­మ­న్నా­రు. ఒక్క మడ­క­శిర మం­డ­లం­లో­నే ఇప్ప­టి వరకు 500 మం­ది­కి ఉపా­ధి కల్పిం­చా­మ­ని గు­ర్తు చే­శా­రు. మడ­క­శి­ర­లో రూ.7 వేల కో­ట్ల­తో సో­లా­ర్ పా­ర్క్ ఏర్పా­టు చే­య­బో­తు­న్న­ట్లు చె­ప్పా­రు. పా­ల­న­లో ప్ర­జ­లు సం­తో­షం­గా ఉన్నా­ర­న్నా­రు.

Tags

Next Story