R5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి..

ఆగమేఘాలపై ఆర్5 జోన్లో రాజధానేతర ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చింది. అమరావతిలో చేపట్టే 47 వేల ఇళ్లకు ఢిల్లీలో జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అనుమతులిచ్చింది. మొదటి విడతగా వీటిని మంజూరు చేసినట్లు తెలిసింది.హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని, తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు కోరే హక్కు లబ్ధిదారులకు ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కేంద్రం దాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. వైకాపా ప్రభుత్వం ఇలా అడగ్గానే కేంద్రం అలా ఆమోదముద్ర వేసేసింది. సీఎం జగన్ అమరావతిలో రాజధానేతరులైన 50793 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వీరిలో 47 వేల మందికి కేంద్రం తాజాగా ఇళ్లు మంజూరు చేయగా మిగతా ఇళ్ల నిర్మాణానికి తదుపరి సమావేశంలో అనుమతులిస్తామని పేర్కొన్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com