ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చింది : చంద్రబాబు

X
అసెంబ్లీలో వైసీపీ సభ్యులు రౌడీల కంటే హీనంగా మాట్లాడుతున్నారని.. ఇది చట్టసభలకు మర్యాదకాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చిందన్నారు. పేదలకు శ్మశానాలు, అవ భూములు, అసైన్డ్ భూములు ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరో కడుపుమండి కోర్టులో కేసులు వేస్తే మాపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన అవినీతిని.. సీబీఐ విచారణ వేస్తే నిరూపిస్తామని సవాల్ విసిరారు. సెంటు భూమి ఇచ్చి మురికివాడలు తయారుచేస్తారా అని ఆగ్రహంవ్యక్తంచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
