టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మృతిపట్ల చంద్రబాబు, లోకేష్ సంతాపం

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ మృతి పట్ల.. చంద్రబాబు, లోకేష్లు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని.. తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారని లోకేష్ అన్నారు. శ్రీనివాస ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు.
సత్యప్రభగారి మృతి తెలుగుదేశం పార్టీకి మరియు చిత్తూరు జిల్లాకు తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతిచేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను(2/2)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) November 20, 2020
టిడిపి జాతీయ ఉపాధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ గారి మృతి విచారకరం.చిత్తూరు ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేసి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.శ్రీనివాస ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి అండగా నిలిచారు.(1/2) pic.twitter.com/tpGaCsKg6h
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 20, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com