రైతుల్ని నిలువునా మోసం చేశారు : చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం చేసింది చెప్పుకునే సత్తా లేకే 5 రోజులు తమ సభ్యుల్ని సస్పెండ్ చేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజల తరఫున మాట్లాడే వారిపై దాడులు చేయటం నీచమని ధ్వజమెత్తారు. దశా దిశ లేని దిశ చట్టాన్ని ఆటకెక్కించారని విమర్శించారు. అవగాహన లేని సీఎం తీసుకునే నిర్ణయాలకు దిశ చట్టం ఓ ఉదాహరణ అని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై కథలు చెప్పి... ఆ ఊసే లేకుండా చేశారంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు..
ప్రభుత్వ ఆస్తుల వేలం వేయటానికి అవి ఏమి జగన్ అబ్బ సొత్తు కాదంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఏడాదిన్నరలో సీఎం జగన్.... రాష్ట్రానికి ఆదాయం కంటే అప్పులు ఎక్కువ చేశారని ఆరోపించారు. ఈ అప్పులకు రెవెన్యూ లోటు కూడా తోడైందన్నారు. ఈ భారాన్ని ప్రజలపై మోపేలా ఇష్టానుసారంగా పన్నులు పెంచేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. .
పంటల బీమాలో వైసీపీ ప్రభుత్వం..... రైతుల్ని నిలువునా మోసం చేసందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. లెక్కల్ని తారుమారు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఇసుక విధానంలో ఏడాదిన్నరగా గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. వివిధ పథకాలపై ఎన్నికల ముందు జగన్ మాట్లాడిన వీడియోల్ని చంద్రబాబు ప్రదర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com