Chandra babu naidu: నూతన మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? చేయాల్సిన.. చేయకూడని పనులేంటి?'.. అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని... ముఖ్యమంత్రి చంద్రబాబు... అమాత్యులతో అన్నారు. శాఖలవారీ శ్వేతపత్రాలు రూపొందించి ప్రజల ముందు ఉంచుతామన్నారు. మరోవైపు ఏ మంత్రికి ఏ శాఖ అనేదానిపై... కసరత్తు పూర్తిచేసి... నేడు బాధ్యతలు కేటాయించనున్నారు.
రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు MBA అర్హత కలిగినవారిని నియమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులతో అన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం... ఉండవల్లి నివాసంలో తనను కలిసిన మంత్రులతో ఆయన గంటకుపైగా... మాట్లాడారు. శాఖలవారీ శ్వేతపత్రాలు సిద్ధం చేసి... ప్రజల ముందు ఉంచుదామని.., జగన్ హయాంలో రివర్స్ విధానాలు, అరాచకాల్ని ప్రజలకు వివరిద్దామన్నారు. గత ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలను నియమించుకోవద్దని సూచించారు. ఓఎస్డీలు, పీఎస్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందిని దరిచేరనివ్వొద్దని స్పష్టం చేశారు. పనితీరు ద్వారా మంత్రిత్వశాఖలకు వన్నె తేవాల్సిన బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు తేల్చిచెప్పారు.
ప్రజలకు సేవ చేయడానికి ఇదో అపూర్వ అవకాశమన్న చంద్రబాబు... మరింత కష్టపడి పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని... మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించాకే సంతకం పెట్టాలని సూచించారు. ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుత స్థితిగతులను... మంత్రులకు వివరించారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని... నిర్దేశించారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేటాయించిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా.. ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.. Spot
మంత్రుల్లో చాలా మంది ఉన్నత విద్యావంతులు, యువకులు ఉన్నారన్న చంద్రబాబు.. ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తప్పులు జరగనివ్వొద్దని... వ్యవస్థలను చక్కదిద్ది.. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com