Chandrababu :ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారు : చంద్రబాబు

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu : ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.

Chandrababu : ఏపీలో పోలీసులు దొంగల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. తిరుపతి వెళ్లే భక్తులు టీ తాగుదామని ఆగితే.. పోలీస్‌ కానిస్టేబుల్‌ వచ్చి కారు తీసుకెళ్లిపోయాడన్నారు. తర్వాత ఆర్టీఏ అధికారులొచ్చి సీఎం కోసం కారు తీసుకెళ్లామని తీరిగ్గా చెప్పడం దారుణమన్నారు. ఎవరైనా అమ్మాయి కావాలని కోరుకుంటే ఇళ్లల్లోకి వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా? అంటూ మండిపడ్డారు. ప్రజల ఆస్తులకు, మహిళల శీలాలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. వైసీపీ రాజకీయాల్లో ఉండదగ్గ పార్టీ కాదన్నారు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. చాలా కోపం వస్తుందన్నారు. సభ్యత అడ్డం వచ్చి సంయమనం పాటిస్తున్నానన్నారు.

Tags

Read MoreRead Less
Next Story