Chandrababu Naidu : కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది : చంద్రబాబు

Chandrababu Naidu : కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది : చంద్రబాబు
Chandrababu Naidu : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందన్నారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

Chandrababu Naidu : కేంద్రం ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్ ఆశానకంగా లేదన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. రైతులకు ఈ బడ్జెట్ ద్వారా ఎలాంటి మేలు జరగదన్నారాయన. పంటలకు మద్దతు ధర విషయంలో ఎలాంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరమన్నారు. పేద వర్గాలు, కోవిడ్ తో దెబ్బతిన్న రంగాలకు ఎలాంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్ లో చెప్పలేదని..... జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చెయ్యడం సరికాదన్నారు చంద్రబాబు. నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో వాటిని తగ్గించేందుకు ఎలాంటి చర్యలను ప్రకటించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

సంస్కరణల విషయంలో కేంద్రం తీసుకున్నకొన్ని నిర్ణయాలను చంద్రబాబు స్వాగతించారు. నదుల అనుసంధానం విషయంలో కేంద్ర ప్రతిపాదనలను స్వాగతించారు చంద్రబాబు. తెలుగుదేశం హయాంలో కృష్ణా - గోదావ‌రి నదుల అనుసంధానం చేయడం ద్వారా 7 ఏళ్ల క్రితమే ఈ ప్రక్రియకు నాంది పలికామన్నారు. టీడీపీ హయాంలో కృష్ణా - గోదావ‌రి -పెన్నా నదుల అనుసంధానం పై ప్రణాళికలు కూడా సిద్దం చేశామని గుర్తు చేశారు.

ఇప్పటికైనా నదుల అనుసంధానంపై కేంద్రం ముందడుగు వెయ్యడాన్ని స్వాగతించారు. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని ఆహ్వానించారు చంద్రబాబు. గతంలో దేశంలో తొలిసారిగా ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీని తెచ్చామన్నారు చంద్రబాబు. డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ కరెన్సీ విషయంలో కేంద్ర ప్రతిపాదనలు మంచి నిర్ణయాలన్నారాయన. సోలార్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ముందుకు రావడం సముచితమన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వం మరో సారి పూర్తిగా విఫలం అయ్యిందమన్నారు. 28 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా సిఎం జగన్ విఫలం అయ్యారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పటికి కేంద్రం నాలుగు బడ్జెట్ లు ప్రవేశ పెట్టినా......28 మంది ఎంపిలు ఉండి రాష్ట్రానికి ఏమీ సాధించలేదన్నారు. వైసీపీ ఎంపీలకు సొంత ప్రయోజనాలపై తప్ప....రాష్ట్ర ప్రయోజనాలపై శ్రద్ద లేదని టీడీపి అధినేత చంద్రబాబు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story