అమరావతిని నాశనం చేయొద్దని సీఎంకి దండం పెట్టి అడుగుతున్నా : చంద్రబాబు
By - Gunnesh UV |14 July 2021 9:45 AM GMT
అమరావతిని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రికి దండం పెట్టి అడుగుతున్నానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
అమరావతిని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రికి దండం పెట్టి అడుగుతున్నానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఓటుకు డబ్బులిచ్చిన వాళ్లు పెత్తందారుల్లా తయారై ప్రజల్ని బానిసల్ని చేస్తున్నారన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనతో యువతను మోసగించారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని తీరాల్సిందేనన్నారు చంద్రబాబు. మాస్క్ పెట్టుకోని ముఖ్యమంత్రిని ఎవరూ ఆదర్శంగా తీసుకోవద్దని.. మాస్క్ పెట్టుకోకుంటే వంద జరిమానా విధిస్తున్న ప్రభుత్వం..జగన్రెడ్డికి ఎంతమేర జరిమానా విధించాలని ప్రశ్నించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com