CM Chandrababu : గుజరాత్‌కు సీఎం చంద్రాబబు.. మోడీతో సమావేశంపై ఆసక్తి

CM Chandrababu : గుజరాత్‌కు సీఎం చంద్రాబబు.. మోడీతో సమావేశంపై ఆసక్తి
X

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుజరాత్‌ వెళ్లారు.. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో పర్యటిస్తారు. గాంధీనగర్ లో నేటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొననున్నారు. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు చంద్రబాబు. ఎనర్జీ రంగంలో పేరున్న పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులతో చర్చల్లో పాల్గొంటారు.

గుజరాత్‌ పర్యటన కోసం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు చంద్రబాబు. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రెన్యూవబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌-2024 గాంధీనగర్‌లో జరగనుంది. ఈ మీట్‌కు ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. దీంతో.. ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తోంది.

Tags

Next Story