CHANDRABABU:మాది ప్రజా ప్రభుత్వం: చంద్రబాబు

CHANDRABABU:మాది ప్రజా ప్రభుత్వం: చంద్రబాబు
X
ప్రజా వేదిక సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేశామని.. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లోనే పెన్షన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇదీ.. పేదల కోసం ప్రభుత్వం పనిచేసే తీరు అని వెల్లడించారు. హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని అన్నారు. 64 లక్షల మందికి ప్రతినెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. కోనసీమ జిల్లా చెయ్యేరులో పర్యటించిన చంద్రబాబు... కాట్రేనికోన మండంలం చెయ్యేరులో లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

కనీవినీ ఎరుగని రీతిలో సాయం

ఏపీలో ఇప్పటికే 90 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పేదలకు కనీవినీ ఎరుగని రీతిలో సహాయం చేసిందని గుర్తు చేశారు. రూ.34 వేల కోట్లు పింఛన్ల కోసం ఇచ్చామని... దేశంలో ఎక్కడా తమ ప్రభుత్వం ఇచ్చినట్లు పెన్షన్లు ఇవ్వడం లేదని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పేదల కోసం ఆలోచించాలన్నారు. భగవంతుడు కనికరిస్తే భవిష్యత్తులో పింఛన్లు పెంచుతామని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం వితంతు పింఛన్లు ఇవ్వలేదని.. తాము వచ్చాక 71,380 మందికి పెన్షన్ ఇచ్చామన్నారు. ధనిక రాష్ట్రం మహారాష్ట్రలో పెన్షన్ రూ. 1000, తెలంగాణలో రూ.2500 మాత్రమే పింఛన్లు ఇస్తున్నారన్నారు. అధిక పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు.

వర్క్‌ ఫ్రం హోంపైనా కీలక వ్యాఖ్యలు

ఏపీలో 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉద్యోగం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఉచిత సిలిండర్ల కోసం నాలుగు నెలలకోసారి అకౌంట్‌లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. రూ.1200 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు రిపేర్ చేశామని చంద్రబాబు తెలిపారు. 203 అన్నా క్యాంటీన్లో భోజనం అందిస్తున్నామన్న చంద్రబాబు రూ.1674 కోట్లు పాత ధాన్యం బకాయిలు చెల్లించామని తెలిపారు. నియోజకవర్గంలో 10 వేల సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ చేస్తామని హెచ్చరించారు.

మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు

గంజాయి, డ్రగ్స్ చాలా ప్రమాదకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా జరిగిందన్న చంద్రబాబు... శాటిలైట్ డ్రోన్స్ ద్వారా గంజాయి నిర్మూలన చేస్తున్నామన్నారు. స్కూళ్లు తెరిచేలోగా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. జనాభా తగ్గిపోయిందని.. రాష్ట్రంలో జనాభా పెరగాలన్నారు.

Tags

Next Story