కడప జిల్లాలో పేలుడు ఘటనపైన చంద్రబాబు దిగ్బ్రాంతి..!

కడప జిల్లాలో పేలుడు ఘటనపైన చంద్రబాబు దిగ్బ్రాంతి..!

Nara chandrababu Naidu (File Photo)

కడప జిల్లాలో పేలుడు ఘటనపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన పైన ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

కడప జిల్లాలో పేలుడు ఘటనపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన పైన ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా పేలుడు పదార్థాల విస్ఫోటనంతో 8 మంది కూలీలు మృతి చెందారు. కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గనిలో ఈ బ్లాస్టింగ్ సంభవించింది. ముగ్గు రాయి తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడుతుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎనమిది మంది కూలీలు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story