రేపు కడపలో బాబు అధ్యక్షతన జోన్-5 సమావేశం
By - Subba Reddy |17 April 2023 9:45 AM GMT
రేపు కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు
రేపు కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. కడపలో చంద్రబాబు అధ్యక్షతన జోన్-5 సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ జోన్-5 సమావేశానికి ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన.. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, మండలాధ్యక్షులు హాజరుకానున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు, వైసీపీ ఆగడాలను తిప్పి కొట్టేందుకు అనుసరించాల్సని వ్యూహాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అటు కడప దర్గాను సందర్శించి ఇఫ్తార్ విందులో పాల్గొననున్న చంద్రబాబు.. బద్వేలులో బిజీ వేముల ఇంట రాత్రి బస చేయనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com