Chandrababu: అమావాస్య రాత్రి ఉదయించిన చంద్రుడు

Chandrababu:  అమావాస్య రాత్రి ఉదయించిన చంద్రుడు
X
తెల్లవారుజాము 4 గంటల వరకు వరద ప్రాంతాల్లోనే

వర్షాలు, వరదలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అడ్మినిస్ట్రేషన్‌లో నిపుణుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు తన మార్క్‌ పాలనతో దూసుకుపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యల్లో భాగంగా ఆహార పదార్ధాలను సిద్దం చేయాలని హోటళ్ల యజమానులకు కోరారు. 74 సంవత్సారాల వయస్సులో అర్ధరాత్రి కూడా ప్రజల కోసం పరితపిస్తూ. కష్ట సమయాల్లో నేనున్ననంటూ బాధితులకు అండగా చల్లని చంద్రుడిగా నిలిచాడు. చంద్రబాబు పాలన అంటే ఇది అని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

అర్ధరాత్రి అజిత్ సింగ్ నగర్లో..

వరద నీటిలో చిక్కుకొని అల్లాడుతున్న ప్రజలను నేరుగా కలవాలనుకున్నారు. అధికారులతో హడావిడి చేయించినంత మాత్రానా ప్రజల్లో భరోసా నిండదని.. స్వయంగా తనే కదిలారు. మీ కోసం నేనున్నానని.. ఈ ఒక్క రాత్రి ధైర్యంగా ఉండండి..సోమవారనికల్లా మీ అందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత తనది అంటూ అజిత్ సింగ్నగర్ వాసులకు హామీ ఇచ్చారు. అలాగే వరద నీరు కూడా తగ్గుతుందని భావిస్తున్నానన్నారు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తామన్నారు. సోమవారం 6 హెలికాప్టర్‌లు వస్తాయని, సహాయక చర్యల్లో పాల్గొంటాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం...

అసలే అమావాస్య రాత్రి..అధికారులు వస్తారని కూడా ఊహించని విజయవాడలోని బుడమేరు సింగ్ నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించి భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. బుడమేరు బాధితులు కట్టుబట్టలతో బయటకు వస్తున్నారని.. వాళ్లకు దుస్తులు ఇవ్వాలని ఆదేశించారు. అధికారులతో కలిసి బోటులో తిరిగారు..వరదనీటిలో చిక్కుకున్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరిదీ హృదయ విదారకమైన పరిస్థితి. వాటిని చూస్తుంటే హృదయం తరుక్కుపోతోంది.వారి మనోధైర్యం దెబ్బతినకుండా చర్యలు చేపడుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీఎం సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. జలదిగ్బంధంలో ఉన్న పెర్రి , జూపూడి, మూలపాడు ప్రాంతాన్ని పరిశీలించారు. కృష్ణలంక , ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు స్థానికులతో మాట్లాడారు. అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. అధైర్యపడకండి.. ఏ సహాయం కావాలన్నా అధికారులు అందుబాటులో ఉంటారు.. హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయండి వరద బాధితులకు తెలిపారు. ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

బస్సులోనే బస..

ఆదివారం రాత్రి 10. 40 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 4.19 గంటల వరకు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రకాశం బ్యారేజి వరద 11 లక్షల క్యూసెక్కులకు చేరుకోవడంతో అక్కడి ప్రజలను ధైర్యంగా ఉండాలని చెబుతూ.. అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌కు వచ్చి బస్సులో బస చేశారు.

Tags

Next Story