Chandrababu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..

Chandrababu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..
Chandrababu : పులివెందులలో టీడీపీ కార్యకర్త పరమేశ్వర్‌రెడ్డి హత్యపై ఏపీ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu : పులివెందులలో టీడీపీ కార్యకర్త పరమేశ్వర్‌రెడ్డి హత్యపై ఏపీ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. హత్య కేసులో నిందితులందరిని అరెస్ట్‌ చేయాలని లేఖలో కోరారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని.. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా.....దాడులు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు.

గత నెల 19న సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామానికి.... చెందిన పరమేశ్వర్‌రెడ్డిని దారుణంగా హత్య చేశారని... 8 మందిపై ఆయన కుమారుడు అనిక్‌ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశాడని, పల్లేటి హరినాథరెడ్డి కుట్ర చేసి హత్య చేసినట్లు అదే రోజు ఫిర్యాదు చేశాడని తెలిపారు. అయితే... 8మంది నిందితుల్లో ముగ్గురిని మాత్రమే అరెస్ట్‌ చేశారన్నారు.

మిగిలిన ఐదుగురు నిందితులు స్వేచ్చగా బయట తిరుగుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీకి చెందిన ఐదుగురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌ నుంచి...తొలగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. నిందితులందరిని అరెస్ట్‌ చేయాల్సి ఉన్నా..ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు చంద్రబాబు. ఈ కేసులో న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story