చిత్తూరులో దారుణం..యువతి గొంతుకోసి హత్య..అనంతరం ఆత్మహత్యాయత్నం

చిత్తూరులో దారుణం జరిగింది. ఓ యువకుడు యువతి గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. వేలూరు రోడ్డులోని ఆనంద థియేటర్ వద్దున్న ఓ బ్యూటీపార్లర్ లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే యువతి దుర్గా ప్రశాంతి చనిపోయినట్లు గుర్తించారు. కొన ఊపిరితో ఉన్న యువకుడు చక్రవర్తిని ఆసుపత్రికి తరలించారు. దుర్గా ప్రశాంతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com