CM Chandrababu : పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండాలి: చంద్రబాబు

CM Chandrababu : పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండాలి: చంద్రబాబు
X

భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. వాటిపై పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండకూడదన్నారు. ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాల నమూనాను విడుదల చేశారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం లాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా? ఎటువంటి చట్టాలు తేవాలి? అనే అంశాలపై చర్చించారు.

రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక కార్యదర్శి సిసోదియా సహా కీలక అధికారులు ఇందులో పాల్గొన్నారు. భూ అక్రమాల పైనే సమీక్షలో సీఎం ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 1.45లక్షల ఎకరాల్లో భూ అక్రమాలు జరిగాయని ప్రభుత్వం శ్వేతపత్రంలో చెప్పిన సంగతి తెలిసిందే.

Tags

Next Story