Warangal : వరంగల్లో గుప్త నిధుల కలకలం

X
By - Manikanta |23 Sept 2024 3:15 PM IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ మూఢనమ్మకాల జాడలు కనిపిస్తూనే ఉంటాయి. ములుగు జిల్లాలో గుప్తనిధుల కలకలం రేగింది. యూనేస్కో గుర్తింపు పొందిన రామప్పలో ఆలయ పరిసరాలల్లో గుప్తనిధుల కోసం గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు జరిపారు. గొల్లాలగుడి ఆలయ పైకప్పు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. గొల్లాల గుడి లోని శివలింగాన్ని పెకలించారు. గుప్తనిధుల తవ్వకంపై పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com